మళ్లీ బాదుడు ..
ఏరుదాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓట్ల కోసం ఈ ఏడాది జనవరి నుంచి చెత్తపన్నును నిలిపివేసిన ప్రభుత్వం.. మళ్లీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది.
చెత్తపన్ను పునరుద్ధరించాలని ఆదేశాలు!
ఎన్నికల కోసం కొన్నినెలల పాటు నిలిపివేసిన జగన్ ప్రభుత్వం
ఈనాడు డిజిటల్, అనంతపురం: ఏరుదాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓట్ల కోసం ఈ ఏడాది జనవరి నుంచి చెత్తపన్నును నిలిపివేసిన ప్రభుత్వం.. మళ్లీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్లాప్ అమలు చేస్తున్న మున్సిపాలిటీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల పన్నుతో పాటు గత నాలుగు నెలల బకాయిలు వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు సచివాలయం సిబ్బంది పేర్కొంటున్నారు. లక్ష్యం విధించి వీలైనంత త్వరగా చెత్తపన్ను వసూలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది పట్టణవాసుల వద్దకు వెళ్లి చెత్తపన్ను వసూలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. నాలుగు నెలల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ అడిగితే పురవాసుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెలకు రూ.11 కోట్లు
ఉమ్మడి జిల్లాలో నాలుగు నెలలుగా చెత్తపన్ను వసూలు లేకపోవడంతో క్లాప్ వాహనాలను కొన్ని ప్రాంతాల్లో నిలిపివేశారు. అనంత కార్పొరేషన్తోపాటు నాలుగు మున్సిపాలిటీలకు 160 వాహనాలు అవసరం కాగా 136 మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ మరమ్మతుల పేరిట కొన్నింటిని మూలన పడేశారు. దీంతో చెత్త సేకరణ లేక అత్యధిక శాతం కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. ఐదు పురపాలికల్లో కలిపి నెలకు రూ.11.91 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం విధించుకున్నారు. అంటే సంవత్సరానికి రూ.142.92 కోట్లు. వాటి పరిధిలో మొత్తం 1.94 లక్షల ఇళ్లు ఉండగా నెలకు రూ.30 నుంచి రూ.60 వరకు.. వ్యాపార వాణిజ్య సముదాయాలకు రూ.120 నుంచి రూ.10 వేలు వరకు వసూలు చేయనున్నారు.
ఎన్నికల ముందు కపటప్రేమ
గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా అధికారంలోకి వచ్చాక చెత్తపన్ను ప్రవేశపెట్టింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, ధర్మవరం, కదిరి మున్సిపాలిటీల్లో క్లాప్ కార్యక్రమం అమలు చేశారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ చెత్త సేకరణ మొదలుపెట్టారు. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో గుత్తేదారులు పూర్తిస్థాయిలో సేకరణ ప్రక్రియను అమలు చేయలేదు. అయినా పురవాసుల నుంచి పన్ను వసూలు చేశారు. కట్టనివారికి పింఛన్లలో కోత విధించారు. కొన్నిచోట్ల సేకరణ చేయకుండా ఇబ్బందులకు గురిచేశారు. జగన్ ప్రభుత్వం.. ఎన్నికల కోసం ఈ ఏడాది జనవరి నుంచి ప్రక్రియను నిలిపివేసింది. అరకొరగా వ్యాపార సముదాయాల నుంచి వసూలు చేసినా ప్రజల జోలికి వెళ్లలేదు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో మళ్లీ బాదుడు మొదలుపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు