logo

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయం

భాజపా జాతీయ కార్యదర్శి ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ సోమవారం ధర్మవరం వచ్చారు. ఎన్డీయే ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ఆయనకు తెదేపా, భాజపా నాయకులు గజమాలలతో సత్కరించారు.

Published : 21 May 2024 03:33 IST

 సత్యకుమార్‌

భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ను పూలమాలతో సత్కరిస్తున్న తెదేపా, భాజపా నాయకులు  
ధర్మవరం, న్యూస్‌టుడే : భాజపా జాతీయ కార్యదర్శి ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ సోమవారం ధర్మవరం వచ్చారు. ఎన్డీయే ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ఆయనకు తెదేపా, భాజపా నాయకులు గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధర్మవరంలో తాను అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని చెప్పారు. ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. భాజపా, తెదేపా నాయకులు పాల్గొన్నారు. గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్థానిక శాంతినగర్‌ 162వ బూత్‌ సెక్షన్‌ ఇన్‌ఛార్జి రామచంద్రను సత్యకుమార్‌ పరామర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు