పురం పారిశ్రామికవాడల్లో నీటికి కటకట
శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి కళ్యాణదుర్గం పంపింగ్ హౌస్ వద్ద నీటిని పంపింగ్ చేయాల్సిన మోటార్లు దెబ్బతినటంతో ప్రస్తుతం ఒకే మోటారు పనిచేస్తోంది.
పారిశ్రామికవాడలకు నీటిని తరలించేందుకు వినియోగించే ట్యాంకర్లు
హిందూపురం అర్బన్, న్యూస్టుడే: శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి కళ్యాణదుర్గం పంపింగ్ హౌస్ వద్ద నీటిని పంపింగ్ చేయాల్సిన మోటార్లు దెబ్బతినటంతో ప్రస్తుతం ఒకే మోటారు పనిచేస్తోంది. రెండో మోటారు మరమ్మతులో ఉన్నందున ఒక మోటారు నీరు గ్రామాలకు సరఫరా చేయటానికే సరిపోవటంతో కొంత కాలంగా హిందూపురం సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడలకు నీటి సరఫరాను అధికారులు నిలిపి వేశారు. దీంతో పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల యజమానులు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలు నడవాలంటే లక్షలాది రూపాయల నీటి భారం మోయాల్సిన దుస్థితి నెలకొంది.
కొనుగోలు చేయాల్సిందే...
తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడలో 19 స్టీల్ పరిశ్రమలు, 4 వస్త్రపరిశ్రమలు, రెండు భారీ రంగుల పరిశ్రమలు, ఫార్మాకంపెనీలు, విప్రో, విద్యుత్తు స్తంభాల తయారీ దాదాపు 180 పరిశ్రమలు ఉన్నాయి. వీటికి ప్రతి రోజు శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా ఒక ఎంఎల్టీ నీటిని సరఫరా చేయాలి. పేరుకే నీటి సరఫరా కాని ఏ నాడు పూర్తిస్థాయిలో వీరికి ఈ నీరు అందిన దాఖలాలు లేవు. దీంతో స్టీల్, రంగుల పరిశ్రమల వారు ప్రతి రోజూ 10 నంచి 20 ట్యాంకర్ల నీటిని రూ.450 నుంచి రూ.500తో రూ.10 వేల నుంచి రూ.20వేల విలువ చేసే నీటిని కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన పరిశ్రమలకు నీటి వినియోగం తక్కువ ఉన్నందున దాదాపు 5 ట్యాకర్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇది పరిశ్రమల యజమానులకు అద]నపు భారమై నెలకు రూ.6-8 లక్షలకు చేరుకొంటుండటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఇతర ఛార్జీలతో సతమతమవుతున్నామని ఇక నీటికి డబ్బు ఎక్కడ నుంచి తీసుకురావాలని, ఇలా అయితే పరిశ్రమలు నడపలేమంటున్నారు.
గోళ్లాపురంలో జోరుగా నీటి వ్యాపారం
తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడలో నీరు అందుబాటులో లేదు. పరిశ్రమల వారు బోర్లు వేసినా అందులో ఉప్పునీరు వస్తుండటంతో పరిశ్రమల వారు తప్పని సరిగా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల పారిశ్రామిక వాడ సమీపంలోని గోళ్లాపురంలో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 150 నీటి ట్యాంకర్లు ఉన్నాయంటే ఎంత మేర వ్యాపారం జరుగుతుందో అర్థమవుతోంది. రైతులు వ్యవసాయానికి వాడాల్సిన నీటిని ప్రస్తుతం పరిశ్రమలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
మరమ్మతులైన వెంటనే సరఫరా
- శ్రీనివాసులు, డీఈ, శ్రీరామరెడ్డి తాగునీటి పథకం
కళ్యాణదుర్గం పంప్హౌస్లో నీటిని పంపింగ్ చేసే మోటార్లు మరమ్మతులు చేస్తున్నారు. ఈ పని పూర్తి అయిన వెంటనే మోటారు బిగించి తూముకుంట
పారిశ్రామిక వాడకు నీటిని సరఫరా చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్