ఎన్ఐఏ సోదాలతో దుర్గం ఉలికిపాటు
రాయదుర్గంలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారుల సోదాలతో మంగళవారం ఉదయం పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని నాగులకట్టవీధిలో విశ్రాంత ఉపాధ్యాయుడు అబ్దుల్లా ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు జరుపుతున్న విషయం దావనంలా పట్టణమంతా వ్యాపించింది.
రాయదుర్గంలో సోహైల్ ఇల్లు
రాయదుర్గం, న్యూస్టుడే: రాయదుర్గంలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారుల సోదాలతో మంగళవారం ఉదయం పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని నాగులకట్టవీధిలో విశ్రాంత ఉపాధ్యాయుడు అబ్దుల్లా ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు జరుపుతున్న విషయం దావనంలా పట్టణమంతా వ్యాపించింది. సోహైల్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి.. బెంగళూరుకు తరలించడం చర్చనీయాంశమైంది. స్థానిక పోలీసుల సహకారంతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు సోహైల్ ఇంటిని చుట్టు ముట్టడంతో స్థానికులు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు.
ఎవరితో మాట్లాడే వాడు కాదు..
ఇంట్లో నుంచి సోహైల్ బయటికి వచ్చేవాడు కాదని.. ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వాడు కాదని స్థానికులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్ వరకు రాయదుర్గంలో చదివిన అతను కుప్పంలో బీటెక్ పూర్తిచేశాడు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకున్నాక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లలో వెలగని అనంత క్రీడాజ్యోతి
[ 26-07-2024]
ఆటల్లో అరంగ్రేటం ప్రతి ఆటగాడి కల. ఒలింపిక్స్లో ఆడాలన్నదే...విశ్వక్రీడల్లో ఒక్క పతకం సాధిస్తే చాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు మారుమోగుతుంది. ఒలింపిక్స్లో స్వర్ణం, రజతం, కాంస్యం ఏ పతకమైనా సాధిస్తే కోట్ల మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. -
గుట్టు వీడుతోంది.. స్త్రీ నిధి సొమ్ము కాజేసిన ఉద్యోగులు
[ 26-07-2024]
మహిళలు స్వయం ఉపాధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు అప్పుగా తీసుకున్న సొమ్ము అక్రమార్కులకు వరంగా మారింది. మహిళలు పైసా పైసా కూడబెట్టిన సొమ్మును డీఆర్డీఏ-వెలుగు ఉద్యోగులు వాటాలు వేసుకుని స్వాహా చేస్తున్నారు. -
9 నెలల్లో 17 మాతృ మరణాలా?
[ 26-07-2024]
‘క్షేత్రస్థాయిలో వైద్య, ఆరోగ్య సిబ్బందిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. తొమ్మిది మాసాల్లో 17 మంది తల్లులు చనిపోయారంటే ఆషామాషీగా తీసుకోవద్దు. మాతృ మరణాలు ఎలా సంభిస్తున్నాయి’ అంటూ కలెక్టర్ వినోద్కుమార్ ప్రశ్నించారు. -
కొత్త ఎస్పీలు.. వేళ్లూనుకున్న సవాళ్లు
[ 26-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దౌర్జన్యాలు రాజ్యమేలాయి. అధికార పార్టీ నాయకుల అండతో కార్యకర్తలు రెచ్చిపోయి తెదేపా సానుభూతిపరులపై అనవసరంగా కేసులు నమోదు చేయించారు. -
ఎమ్మెల్యే ఔదార్యం.. డీఎస్సీ శిక్షణార్థులకు వరం
[ 26-07-2024]
కరవుసీమలో వేలకు వేలు ఖర్చు చేసి డీఎస్సీకి సాధన అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.. వారి కష్టాలను అర్థం చేసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ఉచితశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. సొంత ఖర్చులతో రాష్ట్రంలోని ఉత్తమ శిక్షకులను రప్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. -
20 శాతం పనులే పూర్తి
[ 26-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆసుపత్రి విస్తరణలో భాగంగా పలు విభాగాలకు ప్రత్యేక భవనాలు నిర్మించి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పనుల కింద 2020లో రూ.300 కోట్లు కేటాయించింది. -
ఉగ్రరూప.. తుంగభద్ర
[ 26-07-2024]
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 80 వేల క్యూసెక్కుల దాకా వరద వచ్చి చేరుతుండటంతో జలాశయంలోని 33 గేట్లకుగాను 28 గేట్లను పైకెత్తి 72 వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. -
వీడని గుర్తుతెలియని మృతదేహాల మిస్టరీ
[ 26-07-2024]
గుర్తు తెలియని శవాల ఆచూకీ మిస్టరీగా ఉంటోంది. పట్టణం, గ్రామ ప్రాంతాల్లోనే కాకుండా రైల్వే లైన్లో పలు శవాలు లభ్యం అవుతుండడంతో పోలీసులు కేసులను నమోదు చేసి విచారణ చేస్తుంటే కొన్ని శవాల ఆచూకీ లభిస్తుండగా మరికొన్నింటి సమాచారం వెలుగులోకి రావడం లేదు. -
వ్యాపారం.. ఘరానా మోసం
[ 26-07-2024]
నల్లచెరువు మండల కేంద్రంలో మూడు నెలల కిందట వ్యాపారం నిమిత్తం వచ్చిన ఉమామహేశ్వరెడ్డి పలువురిని మోసం చేసి ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. -
రిలయన్స్ మార్ట్ ధ్వంసం కేసు..
[ 26-07-2024]
రిలయన్స్ మార్ట్ను ధ్వంసం చేసిన కేసును అనంతపురం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న రిలయన్స్ మార్ట్ను రాజశేఖర్రెడ్డి అభిమానులు, ప్రస్తుత వైకాపా నాయకులు 2009లో దాడి చేసి నిప్పు పెట్టారనేది ఆరోపణ. -
భారీగా గోవా మద్యం పట్టివేత
[ 26-07-2024]
రాయదుర్గం మీదుగా అనంతపురానికి అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పెద్దఎత్తున పట్టుబడింది. సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు సీఐలు వెంకటలక్ష్మమ్మ, మురళీమోహన్ తమ సిబ్బందితో కలిసి గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు