అంతా ఏకపక్షమే.. వైకాపాకు కొమ్ముకాసిన కొందరు పోలీసులు!
ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో కొందరు పోలీసులు అధికార వైకాపాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంతోనే తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వచ్చాయి.
తాడిపత్రిలో ఇద్దరికి భారీగా ముడుపులు
గొడవలపై అధికారులకు సమాచారం ఇవ్వని వైనం
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, అనంత నేరవార్తలు
ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో కొందరు పోలీసులు అధికార వైకాపాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంతోనే తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వచ్చాయి. అధికారపార్టీ నాయకులు గొడవలకు తెగపడతారని ముందుగానే సమాచారం ఉన్నా ఉన్నతాధికారులకు చెప్పకుండా మౌనం పాటించడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ విభాగాలు జిల్లాలో పనిచేస్తున్నాయా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలను ముందుగానే పసిగట్టి ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాల్సిన ఆయా విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనే విమర్శలు వచ్చాయి. తాడిపత్రిలో ఇద్దరు అధికారులు, ఎస్బీలో ఓ అధికారి నిర్వాకం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని పోలీసు శాఖలోనే చర్చ నడుస్తోంది. సదరు అధికారులు అధికార వైకాపాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
ఎందుకీ నిర్లక్ష్యం..
తాడిపత్రికి ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరుంది. ఈ ఐదేళ్లలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మూడేళ్ల కిందట ఏకంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ఇంటికి మారణాయుధాలతో వెళ్లి హల్చల్ చేశారు. అనంతరం జరిగిన రాళ్లదాడిలో చాలామందికి గాయాలయ్యాయి. ఇదేమాదిరిగా పోలింగ్ మరుసటి రోజు జరగడం గమనార్హం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెదేపా నేత సూర్యముని ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగడంతో రాళ్ల దాడికి దారి తీసింది. బయట ప్రాంతాలను నుంచి వచ్చిన వందలాది మంది దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గొడవలను ముందుగానే పసిగట్టడంలో అధికారులు విఫలమయ్యారు. కనీస సమాచారం కూడా ఉన్నతాధికారులకు ఇవ్వలేదు. ఇదే విషయాన్ని సిట్ బృందం తన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకపోవడం, సకాలంలో బలగాలను రంగంలోకి దింపకపోవడం వల్లే అల్లర్లు తీవ్రరూపం దాల్చయనే అభిప్రాయాన్ని సిట్ అధికారులు వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తిరుపతి, మాచర్ల ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై బాధ్యులైన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టంది.. తాడిపత్రి అల్లర్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ, తాడిపత్రి డీఎస్పీ, సీఐపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అల్లర్లపై ముందస్తు సమాచారం సేకరించడంలో పూర్తిగా విఫలమైన స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ అధికారులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇద్దరికి భారీగా ముడుపులు
ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి. ఓటర్లతో పాటు రాజకీయ నాయకులు పోలీసులు, అధికారులకు ఎర వేస్తున్నారు. ఓ రాజకీయ పార్టీతో ముడుపులు అందుకున్న పోలీసులు ఎన్నికల్లో కచ్చితంగా వారి కోసమే పనిచేస్తారు. తాడిపత్రి అల్లర్ల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ విషయంపై అప్రమత్తం కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాడిపత్రిలో పనిచేసిన ఇద్దరు అధికారులు వైకాపా ప్రజాప్రతినిధి నుంచి ఎన్నికలకు ముందే భారీగా ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. ఓ అధికారి రూ.25 లక్షలు, మరో అధికారి రూ.20 లక్షలు తీసుకుని ఎన్నికల్లో సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు ఆలస్యంగా తెలిసినట్లు సమాచారం. అప్పటికే ఈసీ చర్యలకు ఉపక్రమించడంతో ముడుపుల విషయాన్ని అక్కడితో వదిలేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తాడిపత్రిలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులకు కూడా వైకాపా ప్రజాప్రతినిధి నుంచి ముడుపులు అందినట్లు తెలుస్తోంది. అల్లర్లను అదుపు చేసే అవకాశం ఉన్నా ముడుపులు అందుకున్న అధికారులు ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంతులేని ప్రేమ దేనికో..
తాడిపత్రిలో అల్లర్లు చెలరేగేందుకు రాజంపేట డీఎస్పీ చైతన్య కూడా ప్రధాన కారణమే. ఆయన తాడిపత్రికి వస్తున్న విషయంపై ఎస్బీలో పనిచేసే అధికారికి తెలిసినా ఎస్పీ అమిత్ బర్దర్కు దృష్టికి తీసుకెళ్లలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీఎస్పీ చైతన్య తాడిపత్రికి ఎలా వచ్చారో తనకు తెలియదని ఎస్పీ స్వయంగా చెపారు. దీని వెనుక ఎస్బీ అధికారి నిర్లక్ష్యం ఉందని పోలీసుశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డీఎస్పీ చైతన్య తాడిపత్రిలో పనిచేసినప్పుడు జరిగిన అల్లర్లు, ఆయనపై వచ్చిన ఆరోపణలు తెలిసి కూడా ఉన్నతాధికారులకు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. విధుల్లో సదరు అధికారి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చైతన్యపై ఇంత అంతులేని ప్రేమ ఎందుకో.. అన్న చర్చ పోలీసు శాఖలో జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు
[ 16-06-2024]
గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు జగనన్న కాలనీల పేరుతో ప్రజాధనాన్ని మెక్కేశారు. ఇళ్ల పట్టాల పంపిణీని అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. రాప్తాడు పరిధిలోని ప్రభుత్వ లేఅవుట్లోని ఓపెన్ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించేశారు. -
పురం వాసుల దశ దిశ మారేనా?
[ 16-06-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో వ్యాపార, వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురం ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న అనేక సమస్యల పరిష్కారానికి 2014-19 మధ్య కాలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రణాళికలతో ముందుకొచ్చారు. -
కొండలు, గుట్టలకు అసైన్డు పట్టాలు
[ 16-06-2024]
గత ప్రభుత్వ హయాంలో కొందరు రెవెన్యూ శాఖాధికారులు వైకాపా నాయకుల అండ చూసుకుని ఇష్టారీతిన పనులు చేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. రెవెన్యూశాఖలో చేసిన ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించుకుని దళారులను ప్రోత్సహించి లబ్ధిదారులతో భారీగా డబ్బులు వసూలు చేసి రూ.లక్షల్లో సంపాదించారు. -
భవితపై ఆశలు ఖాళీల అంచనాల్లో అభ్యర్థులు
[ 16-06-2024]
ముఖ్యమంత్రిగా చండీఎస్సీ ప్రకటనపై సర్వత్రా హర్షాతిరేకాలు.. ద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలెన్ని, ఎన్ని పోస్టులు డీఎస్సీలో భర్తీ చేస్తారో అనే అంశం అభ్యర్థుల్లో చర్చనీయాంశంగా మారింది. -
రూ.కోట్లలో ఎన్నికల బిల్లులు పెండింగ్
[ 16-06-2024]
ఇటీవల జరిగిన లోక్సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఖర్చు పెట్టిన బిల్లుల చెల్లింపునకు నిధుల కొరత తలెత్తింది. రూ.కోటి.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.20 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
7 కేంద్రాలు, 2795 మంది అభ్యర్థులు
[ 16-06-2024]
యూపీఎస్సీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. -
భారీ వర్షాలతో హెచ్చెల్సీకి గండి
[ 16-06-2024]
మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర ఎగువ కాలువ గట్లు కోతకు గురై గండ్లు పడుతున్నాయి. దాంతో నీటి సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. బొమ్మనహాళ్ మండలంలోని 112 కిలోమీటరు వద్ద పొలాల్లోని వర్షపు నీటిని మళ్లించడానికి ఇన్లెట్ లేకపోవడంతో లైనింగ్ దెబ్బతిని గండి పడింది. -
‘దొంగే.. దొంగ అని అరిచినట్లుంది’
[ 16-06-2024]
దొంగే.. దొంగ అని అరిచినట్లు వైకాపా నాయకుల తీరు ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగదీశ్ పేర్కొన్నారు. ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని, ఎంపీ గోరంట్ల మాధవ్లు తెదేపా ప్రభుత్వం, నాయకులపై చేస్తున్న విమర్శలపై స్పందించారు. -
భజ గోవిందం.. సాయి సందేశం
[ 16-06-2024]
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సత్యసాయి సామూహిక అష్టోత్తర సహస్ర నామావళి పఠనంతో ప్రశాంతి నిలయం మార్మోగిపోయింది. సత్యసాయి మహా సమాధి దర్శనార్థం మధ్యప్రదేశ్ రాష్ట్ర భక్తులు పర్తియాత్రతో పుట్టపర్తి వచ్చారు. -
వైకాపా నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
[ 16-06-2024]
వైకాపా నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దానికి సంబంధించిన వివరాలిలా.. ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు, కురుబ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గోవిందుతోపాటు మాజీ వాలంటీరు వరలక్ష్మి, ఆమె భర్త సుధాకర్పై ఈనెల 8న ఉరవకొండ పోలీస్స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.