అంతా ఏకపక్షమే.. వైకాపాకు కొమ్ముకాసిన కొందరు పోలీసులు!
ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో కొందరు పోలీసులు అధికార వైకాపాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంతోనే తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వచ్చాయి.
తాడిపత్రిలో ఇద్దరికి భారీగా ముడుపులు
గొడవలపై అధికారులకు సమాచారం ఇవ్వని వైనం
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, అనంత నేరవార్తలు
ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో కొందరు పోలీసులు అధికార వైకాపాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంతోనే తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వచ్చాయి. అధికారపార్టీ నాయకులు గొడవలకు తెగపడతారని ముందుగానే సమాచారం ఉన్నా ఉన్నతాధికారులకు చెప్పకుండా మౌనం పాటించడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ విభాగాలు జిల్లాలో పనిచేస్తున్నాయా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలను ముందుగానే పసిగట్టి ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాల్సిన ఆయా విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనే విమర్శలు వచ్చాయి. తాడిపత్రిలో ఇద్దరు అధికారులు, ఎస్బీలో ఓ అధికారి నిర్వాకం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని పోలీసు శాఖలోనే చర్చ నడుస్తోంది. సదరు అధికారులు అధికార వైకాపాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
ఎందుకీ నిర్లక్ష్యం..
తాడిపత్రికి ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరుంది. ఈ ఐదేళ్లలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మూడేళ్ల కిందట ఏకంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ఇంటికి మారణాయుధాలతో వెళ్లి హల్చల్ చేశారు. అనంతరం జరిగిన రాళ్లదాడిలో చాలామందికి గాయాలయ్యాయి. ఇదేమాదిరిగా పోలింగ్ మరుసటి రోజు జరగడం గమనార్హం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెదేపా నేత సూర్యముని ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగడంతో రాళ్ల దాడికి దారి తీసింది. బయట ప్రాంతాలను నుంచి వచ్చిన వందలాది మంది దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. గొడవలను ముందుగానే పసిగట్టడంలో అధికారులు విఫలమయ్యారు. కనీస సమాచారం కూడా ఉన్నతాధికారులకు ఇవ్వలేదు. ఇదే విషయాన్ని సిట్ బృందం తన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకపోవడం, సకాలంలో బలగాలను రంగంలోకి దింపకపోవడం వల్లే అల్లర్లు తీవ్రరూపం దాల్చయనే అభిప్రాయాన్ని సిట్ అధికారులు వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తిరుపతి, మాచర్ల ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై బాధ్యులైన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టంది.. తాడిపత్రి అల్లర్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ, తాడిపత్రి డీఎస్పీ, సీఐపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అల్లర్లపై ముందస్తు సమాచారం సేకరించడంలో పూర్తిగా విఫలమైన స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ అధికారులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇద్దరికి భారీగా ముడుపులు
ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి. ఓటర్లతో పాటు రాజకీయ నాయకులు పోలీసులు, అధికారులకు ఎర వేస్తున్నారు. ఓ రాజకీయ పార్టీతో ముడుపులు అందుకున్న పోలీసులు ఎన్నికల్లో కచ్చితంగా వారి కోసమే పనిచేస్తారు. తాడిపత్రి అల్లర్ల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ విషయంపై అప్రమత్తం కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాడిపత్రిలో పనిచేసిన ఇద్దరు అధికారులు వైకాపా ప్రజాప్రతినిధి నుంచి ఎన్నికలకు ముందే భారీగా ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. ఓ అధికారి రూ.25 లక్షలు, మరో అధికారి రూ.20 లక్షలు తీసుకుని ఎన్నికల్లో సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు ఆలస్యంగా తెలిసినట్లు సమాచారం. అప్పటికే ఈసీ చర్యలకు ఉపక్రమించడంతో ముడుపుల విషయాన్ని అక్కడితో వదిలేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తాడిపత్రిలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులకు కూడా వైకాపా ప్రజాప్రతినిధి నుంచి ముడుపులు అందినట్లు తెలుస్తోంది. అల్లర్లను అదుపు చేసే అవకాశం ఉన్నా ముడుపులు అందుకున్న అధికారులు ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంతులేని ప్రేమ దేనికో..
తాడిపత్రిలో అల్లర్లు చెలరేగేందుకు రాజంపేట డీఎస్పీ చైతన్య కూడా ప్రధాన కారణమే. ఆయన తాడిపత్రికి వస్తున్న విషయంపై ఎస్బీలో పనిచేసే అధికారికి తెలిసినా ఎస్పీ అమిత్ బర్దర్కు దృష్టికి తీసుకెళ్లలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీఎస్పీ చైతన్య తాడిపత్రికి ఎలా వచ్చారో తనకు తెలియదని ఎస్పీ స్వయంగా చెపారు. దీని వెనుక ఎస్బీ అధికారి నిర్లక్ష్యం ఉందని పోలీసుశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. డీఎస్పీ చైతన్య తాడిపత్రిలో పనిచేసినప్పుడు జరిగిన అల్లర్లు, ఆయనపై వచ్చిన ఆరోపణలు తెలిసి కూడా ఉన్నతాధికారులకు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. విధుల్లో సదరు అధికారి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చైతన్యపై ఇంత అంతులేని ప్రేమ ఎందుకో.. అన్న చర్చ పోలీసు శాఖలో జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి