‘ఓట్ల లెక్కింపులో సొంత నిర్ణయాలు వద్దు’
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ అరుణ్బాబు అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అరుణ్బాబు, అధికారులు
పుట్టపర్తి, న్యూస్టుడే : ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ అరుణ్బాబు అన్నారు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. శుక్రవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులు, సహాయ అధికారులు, అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులతో తొలి విడత అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓట్ల లెక్కింపు పక్రియలో వివిధ దశల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెరపై ప్రదర్శించారు. చిన్న పొరపాటుకు కూడా తావు ఇవ్వద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లాలో హిందూపురం పార్లమెంటు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కౌటింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. హిందూపురం బీట్స్ కళాశాలలో హిందూపురం, కదిరి, పెనుగొండ, మడకశిర, లేపాక్షి బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతందని, ఉదయం 6 గంటలకే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకుని అంతా సిద్ధం చేసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్తో పాటు, ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ హాలులో రిటర్నింగ్ అధికారులదే సర్వాధికారమని, వారే పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. జేసీ అభిషేక్కుమార్ మాట్లాడుతూ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు పోలైన పోస్టల్ బ్యాలెట్ వివిధ దశల్లో పరిశీలన చేయాలన్నారు. పారదర్శకంగా ఓట్లు లెక్కింపు ప్రక్రియ జరగాలన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అపూర్వభరత్, డీఆర్ఓ కొండయ్య, రిటర్నింగ్ అధికారులు భాగ్యరేఖ, వెంకటశివసాయిరెడ్డి, గౌరీశంకర్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?