పురంలో కట్టుతప్పిన పట్టణ ప్రణాళిక
హిందూపురం మున్సిపల్ పట్టణ ప్రణాళికా విభాగం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పని చేస్తూ.. సామాన్యులను వేధించడమే పనిగా, నిబంధనల సాకుతో దండుకోవడమే పరమావధిగా పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అధికార పార్టీ అండతో అవినీతి దందా
పురపాలిక కార్యాలయంలో పట్టణ ప్రణాళికా విభాగం
హిందూపురం, న్యూస్టుడే: హిందూపురం మున్సిపల్ పట్టణ ప్రణాళికా విభాగం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పని చేస్తూ.. సామాన్యులను వేధించడమే పనిగా, నిబంధనల సాకుతో దండుకోవడమే పరమావధిగా పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు కౌన్సిలర్ల అండతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేసినా పట్టించుకోని అధికారులు, సామాన్యులను సెట్ బ్యాక్ నిబంధనల పేరుతో వేధిస్తున్నారు. నోటీసులు ఇస్తూ.. ఛార్జీషీట్లు వేసి కోర్టుల్లో కేసు వేస్తున్నారు. భారీ భవంతులు, మాల్స్ నిర్వాహకులతో నాయకులు లక్షలాది రూపాయలు దండుకొని.. వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూస్తున్నారు. నిబంధనల అతిక్రమణ నోటీసు ఇచ్చినా...వాటిని వెనక్కి తీసుకొనేలా చూస్తున్నారు. హిందూపురం పురపాలిక పరిధిలో ఎక్కడ భవన నిర్మాణం జరిగినా కొందరు వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు... వాటి యజమానుల నుంచి సొమ్ము చేసుకొంటున్నారు. అధికార పార్టీ నాయకులే మున్సిపల్ సిబ్బందిని పంపి నోటీసులు ఇప్పించి... భవన యజమానులను బెదరగొట్టడం, దారికి వస్తే అంతోఇంతో రాబట్టుకొని వదిలేయడం చేస్తున్నారు. కొందరు భవన యజమానులు ప్రశ్నిస్తు ఛార్జీషీట్లు దాఖలు చేసి నిర్మాణాలు నిలిపివేయించి కోర్టులో కేసులు వేస్తున్నారు.
మనోళ్లే.. వదిలేయండి!
పట్టణంలోని 40 మంది భవన యజమానులపై ఛార్జీషీట్లు వేసి కోర్టులో కేసులు వేశారు. మరో 21 మందిపై మాత్రం కరుణ చూపారు. దీని వెనుక అధికార పార్టీ ముఖ్య నాయకుడు జోక్యం చేసుకొని 21 మంది మనవాళ్లని... కోర్టుకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. దీంతో మున్సిపల్ అధికారులు ఛార్జీషీటుకు జత చేయాల్సిన స్థల మార్కెట్ విలువను అదే పనిగా తప్పుగా చూపించారు. వాటిని సరిచేసి, మళ్లీ కోర్టులో వేస్తామని 21 ఛార్జీషీట్లను వెనక్కు తీసుకొచ్చారు. మళ్లీ ఇప్పటి దాకా కోర్టులో వేయకపోవడానికి కారణం అధికార పార్టీ ముఖ్య నేత ఆదేశాలేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయమా?
- వాసవీ ధర్మశాల రోడ్లోని ఓ భవంతికి సంబంధించి నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వచ్చాయి. దాని యజమాని అధికార పార్టీ నాయకులతో మాట్లాడుకోవడంతో తరువాత ఎలాంటి చర్యలు లేవు.
- బాలాజీ టాకీస్ రోడ్లో ఓ మాల్ నిర్మాణానికి సంబంధించి లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల విషయంలో భారీగా దండుకొన్నారు. అవినీతి సొమ్మును పంచుకోవడంలో ఓ మున్సిపల్ అధికారికి, నాయకులకు వివాదం తలెత్తి.. కొట్టుకొనే వరకు వెళ్లారు.
- బైపాస్ రహదారిలో నిర్మిస్తున్న ఓ భవంతి అనుమతుల విషయంలో అనుమానాలు ఉన్నాయి. దీన్ని కొందరు కౌన్సిలర్లు గుర్తించారు. లక్షలాది రూపాయలు ఇవ్వాలని యజమానిపై వివిధ రూపాల్లో ఒత్తిడి తెచ్చారు. ఆయన తనకున్న పలుకుబడి ఉపయోగించుకొని అధికార పార్టీలోనే పెద్ద నాయకులతో చెప్పించుకొని బయటపడ్డారు.
నా దృష్టికి రాలేదు
నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కోర్టులో కేసులు వేసిన విషయం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నా దృష్టికి తీసుకురాలేదు. నేను మార్చిలో ఇక్కడకు బదిలీపై వచ్చాను. పట్టణ ప్రణాళిక అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకొంటాం.
శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, హిందూపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్