ముంచుకొస్తున్న సాగు సమయం
శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తుండటంతో దుక్కులు చేసే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఈనెల 29న విత్తన వేరుసెనగ పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
ఆర్బీకేలకు చేరని ఎరువులు
అన్నదాతల ఎదురుచూపులు
నల్లచెరువులోని రైతు భరోసా కేంద్రం
కదిరి, బుక్కపట్నం, ముదిగుబ్బ, న్యూస్టుడే: శ్రీసత్యసాయి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తుండటంతో దుక్కులు చేసే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఈనెల 29న విత్తన వేరుసెనగ పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అన్నదాతల అవసరాలు తీర్చేందుకు భరోసా కేంద్రాలను నిర్మించినట్లు వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. సలహాలు, సూచనలు ఇచ్చేవారితోపాటు అవసరమైన ఎరువులు, పురుగు మందులు మాత్రం అందుబాటులో లేవని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్లో వేరుసెనగ సాగుకు దుక్కి సమయంలోనే ఎరువులు వినియోగిస్తారు. పశువుల ఎరువైతే ముందే పొలంలో వేసి దుక్కి చేస్తారు. తద్వారా భూసారం పెరగటం, నేల గుల్లబారేందుకు దోహదపడుతోంది. సేంద్రియ ఎరువులు కరవైన స్థితిలో రసాయన ఎరువులే రైతులకు ఆధారమయ్యాయి. దీంతో సూపర్ పాస్పేట్, డీఏపీ, యూరియా అవసరం ఉంది. ఆర్బీకేల్లో ఎరువులు అరకొరగా ఉన్నాయి. పురుగులు మందులైతే సరఫరాయే లేదని సిబ్బంది చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాలకు ముందస్తుగా నాణ్యత ధ్రువీకరణతో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయాల్సి ఉంటుంది. రైతులు వాటినే అడుగుతున్నా సిబ్బంది నుంచి సరైన సమాధానం లేదు. దీంతో ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
- రైతు భరోసా కేంద్రాలు 416
- వేరుసెనగ సాగు విస్తీర్ణం 1,74,910 హెక్టార్లు
- అవసరమైన ఎరువులు 39,378 మెట్రిక్ టన్నులు
అవసరమైనవి లేవు
నేను 16 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. నాలుగెకరాల్లో వేరుసెనగ సాగు చేశా. ఎనిమిది ఎకరాల్లో విడతల వారీగా దోసపంట వేస్తా. భూదానంపల్లిలోని రైతు భరోసా కేంద్రంలో అవసరమైన ఎరువులు అందుబాటులో లేవు. ముదిగుబ్బకు వెళ్లాలంటే 30 కి.మీ.దూరం ఉంది. బత్తలపల్లిలోని ఎరువుల దుకాణంలో డీఏపీ, 12:12:24, 10:26:26, 0:0:23 రకాలను రూ.20 వేలతో కొనుగోలు చేశా. రవాణా ఖర్చు రూ.3 వేలు అయింది.
చంద్రశేఖర్రెడ్డి, రైతు, చిన్నకోట్ల
ఇంతవరకు ఇవ్వలేదు
మారాలలో రైతు భరోసా కేంద్రం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ఎరువులు అందుబాటులో లేవు. వేరుసెనగ, వరి సాగు చేస్తున్నా. స్థానికంగా ఎరువులు, మందులు ఎప్పుడూ ఇవ్వలేదు. ఎరువులు ఏవైనా కావాలంటే పాముదుర్తి, ముదిగుబ్బకు వెళ్లక తప్పటంలేదు. గ్రామంలోనే అందుబాటులో ఉంచితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
నాగరాజు, రైతు, మారాల
నిల్వ సమస్యతోనే...
జిల్లాలో వేరుసెనగ సాగు రైతులకు అవసరమైన ఎరువుల కోసం నివేదికలు పంపాం. కావాల్సిన ఎరువులను రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేస్తాం. ప్రస్తుతం విత్తన పంపిణీ జరుగుతోంది. ఆర్బీకేల్లో విత్తనం ఉండటంతో ఎరువులను అక్కడే నిల్వ చేస్తే సమస్య వస్తుంది. అందుకే వేరుసెనగ విత్తన పంపిణీ తర్వాత ఎరువులను రైతులకు అందిస్తాం. అవసరాన్ని బట్టి పురుగు మందులు ఇస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత