విద్యుత్తు సమస్యలు కోకొల్లలు..ఏవీ ముందస్తు చర్యలు?
ఇటీవల ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గాలులు వీస్తూ కురిసిన వర్షం ధాటికి పెద్ద ఎత్తున స్తంభాలు నేలకొరిగాయి.
జిల్లా పశు సంవర్ధకశాఖ కార్యాలయం వద్ద విద్యుత్తు తీగలపై పడిన కొమ్మలు
అనంతపురం(విద్యుత్తు), వ్యవసాయం, నార్పల, న్యూస్టుడే: ఇటీవల ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గాలులు వీస్తూ కురిసిన వర్షం ధాటికి పెద్ద ఎత్తున స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. విద్యుత్తుశాఖకు రూ.లక్షల్లో నష్టం వచ్చింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన విద్యుత్తు అధికారులు, ఉద్యోగులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే తమ సెక్షన్ పరిధిలో శిథిలావస్థకు చేరిన స్తంభాలు, వేలాడుతున్న తీగలను ఎప్పటికప్పుడు గుర్తించి మార్చేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు సమస్యలు తలెత్తినపడు మినహా మిగతా సమయాల్లో తమకు కేటాయించిన ప్రాంతాలను పరిశీలించడం లేదు. లైన్లపై చెట్లు పెరిగినప్పుడు ముందస్తుగా గుర్తించి తీగలపై వెళుతున్న కొమ్మలను తొలగింపు చేపట్టడం లేదు. కొత్త విద్యుత్తు స్తంభాలను కూడా సిమెంట్ కాంక్రీ¨ట్ వేసి ఏర్పాటు చేయకుండా తూతూ మంత్రంగా ఏర్పాటు చేయడంతో పటిష్టత లేక చిన్నపాటి గాలివీచినా విరిగి పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
- అనంతపురం పశు సంవర్ధకశాఖ కార్యాలయం వద్ద చెట్టుకొమ్మలు విద్యుత్తు లైన్పై విరిగిపడటంతో లైన్కిందకు వచ్చి ప్రమాదకరంగా మారింది. కనీసం విద్యుత్తు ఉద్యోగులు లైన్పై పడిన చెట్టుకొమ్మలు తొలగించి లైన్ను సరిచేసేందుకు చర్యలు చేపట్టలేదు.
- నార్పల సమీపాన పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఒక ప్రైవేట్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆవరణలో విద్యుత్తు లైన్ వెళుతుండగా ఇందుకు ఏర్పాటు చేసిన స్తంభాల్లో కొన్ని పక్కకు ఒరిగిపోయాయి. ఓ స్తంభం కూలేందుకు సిద్ధంగా ఉంది. అవి వాలి కిందపడి.. ప్రమాదాలు జరిగి మనుషులు, మూగజంతువులు ప్రాణాలు కోల్పోయినపుడే విద్యుత్తు ఉద్యోగులు కాస్త స్పందిస్తున్నారు. లేకుంటే అసలు పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
- పలుమార్లు తమ ప్రాంతాల పరిధిలో స్తంభాలు పడిపోయే స్థితిలో ఉన్నాయని, లైన్లు కిందికి వచ్చి ప్రమాదకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని రైతులు, ప్రజలు వాపోతున్నారు. సమస్యల్ని అనంతపురం టౌన్ డివిజన్ ఈఈ జె.వి.రమేశ్ దృష్టికి తీసుకెళ్లగా ఉద్యోగులను క్షేత్రస్థాయికి పంపి సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్