పూడిక తీయరు.. మరమ్మతులు చేయరు
ఉమ్మడి జిల్లా వరప్రదాయినిగా భావించే తుంగభద్ర-ప్రధాన ఎగువ కాలువ(టీబీ హెచ్చెల్సీ) దయనీయ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాన కాలువతోపాటు ఉప కాలువల నిర్వహణ దారుణంగా ఉంది.
సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు
నిర్వహణ లేక రూపు కోల్పోతున్న హెచ్చెల్సీ
అనంతపురం (శ్రీనివాస్నగర్), న్యూస్టుడే
అనంతపురం: ఎస్ఎస్ ట్యాంకు సమీపంలో రూపు కోల్పోయిన కాలువ
ఉమ్మడి జిల్లా వరప్రదాయినిగా భావించే తుంగభద్ర-ప్రధాన ఎగువ కాలువ(టీబీ హెచ్చెల్సీ) దయనీయ దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాన కాలువతోపాటు ఉప కాలువల నిర్వహణ దారుణంగా ఉంది. జూన్ ఆరంభంతోనే 2024-25 నీటి సీజన్ మొదలు కానుంది. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల గుండా వెళ్లే కాలువల నిర్వహణ అటకెక్కింది. అక్కడక్కడ.. ఉపాధి హామీ పథకం కింద గట్టున ఉండే ముళ్లకంపను తొలగించారు. అత్యధిక శాతం కాలువల్లో పూడిక పేరుకుపోయింది. గట్లన్నీ శిథిలావస్థకు చేరాయి. గతంలో కురిసిన వర్షాలకు ప్రధాన గట్లు కోతకు గురయ్యాయి. చెత్తాచెదారం పేరుకుపోయి డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. ఇంతటి దయనీయ దుస్థితిలో నీటి ప్రవాహం సాఫీగా సాగే పరిస్థితి లేదు. తక్కువ జలాలు కేటాయించినా వేగంగా ముందుకు పారే పరిస్థితి ఉండదు. ఇన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా కేటాయించలేదు.
హెచ్చెల్సీ కార్యాలయం సమీపాన కాలువ గట్టు దుస్థితి
అటకెక్కిన ఆధునికీకరణ
హెచ్ఎల్సీ ప్రధాన, ఎమ్పీఆర్ దక్షిణ, ఉత్తర కాలువల ఆధునికీకరణ పనులకు వైకాపా ప్రభుత్వం పాతరేసింది. గతంలో జరిగిన పనులన్నీ ఆపేసింది. మరమ్మతు, లైనింగ్, గట్లు పటిష్టత, వంతెనల నిర్మాణం.. తదితర పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గడిచిన ఐదేళ్లలో నయాపైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. నీటి సీజన్ మొదలు కానుంది. ఈలోపు ఎక్కడైనా చిన్నపాటి మరమ్మతులు, చెత్తాచెదారం, ముళ్లకంప తొలగింపు, పూడికతీత.. వంటి పనులు చేయించలేదని దుస్థితి నెలకొంది. దీంతో నీటి ప్రవాహం సాఫీగా పరిస్థితి లేదు. అనంత నగరం గుండా వెళ్లే ఎమ్పీఆర్ దక్షిణ కాలువ రూపు కోల్పోతోంది. దాదాపు పది కి.మీ. ఉండే కాలువ దారుణంగా మారింది.
1.93 లక్షల ఎకరాలు
హెచ్చెల్సీ కింద 12 రకాల కాలువలు ఉండగా.. ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో తొమ్మిది ఉన్నాయి. హెచ్ఎల్సీ ప్రధాన కాలువ, ఎమ్పీఆర్ కింద దక్షిణ, ఉత్తర, తాడిపత్రి ఉప కాలువ (టీబీసీ), గుంతకల్లు ఉప కాలువ (జీబీసీ), గుత్తి ఉప కాలువ (జీఎస్బీసీ)తోపాటు... పీఏబీఆర్ కుడి కాలువ, ధర్మవరం ఉప కాలువ (డీబీసీ), బి.పప్పూరు కాలువ ఉన్నాయి. వాటి పొడువు మొత్తం 520.49 కి.మీ.కాగా ఆయకట్టు 1,92,749 ఎకరాలు.
ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది
గ్రామీణ ప్రాంతాల్లోని కాలువలకు సంబంధించి నిర్వహణను ఉపాధి హామీ పథకం నిధులతో చేయిస్తున్నాం. కొన్ని చోట్ల పనులు మొదలయ్యాయి. పట్టణ ప్రాంతాల పరిధిలో ఉండే కాలువలకు ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. దీంతో మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టలేకపోయాం. ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప పనులు చేసే పరిస్థితి లేదు.
రమణారెడ్డి, ఈఈ, హెచ్చెల్సీ లోకలైజేషన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?