‘నయవంచన ప్రభుత్వాన్ని గద్దె దించుదాం’
నయవంచన ప్రభుత్వాన్ని గద్దెదించుదాం అని కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు పిలుపునిచ్చారు
ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఉమామహేశ్వరనాయుడు
రుద్రంపల్లి(కుందుర్పి), న్యూస్టుడే: నయవంచన ప్రభుత్వాన్ని గద్దెదించుదాం అని కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని రుద్రంపల్లి గ్రామంలో తెదేపా చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ నియోజకవర్గం స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ముందుగా స్థానిక గురువేపల్లి గేటు నుంచి రుద్రంపల్లి వరకు కార్యకర్తలు, నాయకులతో కలిసి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాతూ.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధిని మరచి ప్రజాప్రతినిధులు, నాయకులు అరాచకాలకు పాల్పడుతూ పాలన చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్తు, బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని దుయ్యబట్టారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ధనుంజయ, పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి తలారి సత్యప్ప, నాయకులు నారాయణ, ప్రకాష్, మమత తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి