కొర్రపాడు గురుకులంలో అక్రమాలు!
బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కొర్రపాడులో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
బుక్కరాయసముద్రం, న్యూస్టుడే: బుక్కరాయసముద్రం మండల పరిధిలోని కొర్రపాడులో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ 5 నుంచి 10వ తరగతి వరకూ 480 మందికిపైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. కొన్ని నెలల క్రితమే నూతనంగా నిర్మించిన భవనాల్లోకి గురుకుల పాఠశాలను మార్చారు. అప్పటి నుంచి అక్రమాలు జరుగుతున్నాయంటూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ నాయకులు ఆరోపిస్తూ పలుమార్లు ఆందోళనలు చేశారు. ఈ విషయంపై సోమవారం స్పందనలో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ జిల్లా నాయకుడు చిన్నఆంజనేయులు, కుమార్తెతో కలిసి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్ చేయించుకున్నట్లు ఉన్న వీడియోలు, సామగ్రి వాహనాల్లో బయటకు తరలిస్తున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో విద్యాలయం నిర్వహణపై, విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రిన్సిపల్ విజయలక్ష్మిని వివరణ కోరగా విద్యాలయంపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఉపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్ చేయించుకున్నట్లు ఉన్న వీడియోపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలో వృథా సామగ్రిని బయట విక్రయించి వచ్చిన డబ్బును పాఠశాల ఖాతాలో జమ చేశామని తెలిపారు. విద్యార్థినులకు మెరుగైన విద్య, వసతి కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు