logo

చెప్పినట్లు చేయకపోతే దాడి చేస్తారా?

చెప్పినట్లు వినకపోయినా, చేయకపోయినా రెవెన్యూ ఉద్యోగులపై దాడి చేస్తారా? అని మండల వీఆర్వోలు ఆక్షేపించారు. చెన్నేకొత్తపల్లి వీఆర్వో లోకేశ్‌పై వైకాపా కార్యకర్త సోమశేఖర్‌రెడ్డి దాడికి పాల్పడిన ఘటనను వ్యతిరేకిస్తూ

Published : 08 Dec 2023 04:11 IST

బాధిత వీఆర్వోతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న తహసీల్దార్‌ షాబుద్దీన్‌, వీఆర్వోలు  

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: చెప్పినట్లు వినకపోయినా, చేయకపోయినా రెవెన్యూ ఉద్యోగులపై దాడి చేస్తారా? అని మండల వీఆర్వోలు ఆక్షేపించారు. చెన్నేకొత్తపల్లి వీఆర్వో లోకేశ్‌పై వైకాపా కార్యకర్త సోమశేఖర్‌రెడ్డి దాడికి పాల్పడిన ఘటనను వ్యతిరేకిస్తూ తహసీల్దార్‌ కార్యాలయం ముందు తహసీల్దార్‌ షాబుద్దీన్‌, మండల వీఆర్వోలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. తోటి సిబ్బంది చూస్తుండగా అహంకారంతో సోమశేఖర్‌రెడ్డి దాడికి పాల్పడటం శోచనీయమన్నారు. ఇలాంటి దౌర్జన్యాలతో ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వీఆర్వోపై దాడిని వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ఖండించారు. ఇలాంటి దాడులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్‌ఐ శివారెడ్డి, వీఆర్వోలు వెంకటేశ్‌, తులసమ్మ, మండల సర్వేయర్‌ సంతోష లక్ష్మి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని