సీఎం జగన్పై టీఎన్ఎస్ఎఫ్ ఫిర్యాదులు
అబద్ధపు హామీలతో విద్యార్థులకు సీఎం జగన్ నమ్మకద్రోహం చేశారని..సీఎంపై కేసు నమోదు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహ, జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు గురువారం అనంతపురం గ్రామీణం పోలీస్స్టేషనులో ఫిర్యాదు చేశారు.
అనంతపురం గ్రామీణం సీఐ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేస్తూ..
అనంత నేరవార్తలు, హిందూపురంఅర్బన్: అబద్ధపు హామీలతో విద్యార్థులకు సీఎం జగన్ నమ్మకద్రోహం చేశారని..సీఎంపై కేసు నమోదు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహ, జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు గురువారం అనంతపురం గ్రామీణం పోలీస్స్టేషనులో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ. ‘అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని..మీ పిల్లలు డాక్టర్, ఇంజినీర్ ఇలా ఏది కావాలన్నా చదువుకోమనండి..చదివించే పూచీ నాది’ అని ప్రగల్బాలు పలికిన జగన్..అధికారం చేపట్టాక మాట తప్పాడని ఆరోపించారు. నాణ్యమైన విద్య లభించక విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు టీచర్ల కొరత, మరోవైపు పనికిరాని బైజూస్లో అవినీతితో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ అథమ స్థాయికి దిగజారిందన్నారు.నాలుగున్నరేళ్లలో 7.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తరలిపోయారన్నారు. అమ్మఒడి, ఫీజు రీయంబర్స్మెంట్ తదితర స్కీంలు అటకెక్కాయని తెలిపారు. నాడు నేడు పేరుతో పాఠశాలలకు రంగులు వేసి రూ.3 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అబద్ధపు మాటలు, హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్పై చీటింగ్ కేసు నమోదు చేయాలని సీఐ రామకృష్ణారెడ్డిని కోరారు.
హిందూపురం వన్టౌన్ పోలీస్స్టేషన్లోనూ టీఎన్ఎస్ఎఫ్ ఎంపీ నియోజకవర్గ అధ్యక్షుడు కురుబ జగదీశ్ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. సంఘం ఉపాధ్యక్షుడు వెంకటాపురం అభి, అధికార ప్రతినిధి ఎండీఎస్ అమన్, కార్యదర్శి మూర్తి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం