logo

ఉపాధి హామీ క్షేత్ర పరిశీలకుడా.. వైకాపా నాయకుడా?

మండలంలోని హొట్టేబెట్ట పంచాయతీలో ఉపాధిహామీ పథకం క్షేత్ర పరిశీలకుడిగా విధులు నిర్వహిస్తున్న నరసింహమూర్తి గురువారం వైకాపా జెండాతో...

Published : 08 Dec 2023 04:25 IST

పార్టీ జెండా చేతపట్టి సభకు హాజరైన నరసింహమూర్తి

రొళ్ల, న్యూస్‌టుడే: మండలంలోని హొట్టేబెట్ట పంచాయతీలో ఉపాధిహామీ పథకం క్షేత్ర పరిశీలకుడిగా విధులు నిర్వహిస్తున్న నరసింహమూర్తి గురువారం వైకాపా జెండాతో మడకశిరలో జరిగిన బీసీ సామాజిక సాధికార బస్సుయాత్ర సభకు హాజరయ్యాడు.ఆయన పలువురు కార్యకర్తలతో కలిసి వాహనాల్లో సభకు తరలివెళ్లాడు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సేవలందించాల్సిన క్షేత్రపరిశీలకుడు పార్టీ జెండాలతో సభకు తరలివెళ్లడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని