కదం తొక్కిన ఆశా కార్యకర్తలు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు అనంత కలెక్టరేట్ను ముట్టడించారు.
అనంత కలెక్టరేట్ ముట్టడి
కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన
అనంతపురం(శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు అనంత కలెక్టరేట్ను ముట్టడించారు. తొలుత ప్రధాన రహదారి గుండా నిరసన ర్యాలీతో కలెక్టరేట్కు చేరుకున్నారు. ఇక్కడి ప్రధాన గేటు ముందు నడిరోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలతో గ్రామాల్లో, పట్టణాల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారని గుర్తు చేశారు. అప్పట్లో చాలా మంది అదే మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. నయాపైసా పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సత్వరమే వీరి కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఆశా కార్యకర్తల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి, మున్సిపల్ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆశాలకు రూ.6 వేలు ప్రకారం చెల్లించారు. తమ ప్రభుత్వం వస్తే కనీస వేతనం ఇస్తామంటూ జగన్ నమ్మించారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు సైతం రద్దు చేసినట్లు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ లోపలికి వెళ్లడానికి యత్నించారు. పరిస్థితి అదుపులోకి తెచ్చుకోవడానికి ఏఐటీయూసీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు శివకృష్ణ, పార్వతి, హసీనా, ఫాతిమా, చిట్టి, సుగుణ, దుర్గమ్మ, అనంతలక్ష్మి పాల్గొన్నారు.
ఏఐటీయూసీ నాయకుడు రాజేశ్ను తరలిస్తున్న పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు