పంటల దిగుబడిపై దిగులు
వర్షాభావంతో హెచ్ఎల్సీకి తుంగభద్ర జలాల సరఫరా ఆగిపోయింది. అనుబంధంగా సాగే గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ)లో నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఈ కాలువ కింద 32 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. సింహభాగం మిరప పంటదే.
జీబీసీకి కృష్ణాజలాల తరలింపులో కానరాని ప్రత్యామ్నాయ చర్యలు
పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
ఆందోళనలో అన్నదాతలు
ఉరవకొండ, విడపనకల్లు, న్యూస్టుడే
ప్రత్యామ్నాయ కాలువలో ముళ్లకంపలు ఇలా..
వర్షాభావంతో హెచ్ఎల్సీకి తుంగభద్ర జలాల సరఫరా ఆగిపోయింది. అనుబంధంగా సాగే గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ)లో నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఈ కాలువ కింద 32 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. సింహభాగం మిరప పంటదే. ప్రస్తుతం పిందె దశలో ఉండటంతో నీటి తడులు అవసరం. వర్షాలు రాకపోయినా తుంగభద్ర నీటితో ఇన్నాళ్లూ రైతులు పంటను కాపాడుకున్నారు. మరో నెల రోజులు నీరందిస్తే వేల ఎకరాల్లో మిరపతో పాటు ఇతర పంటలు చేతికి అందే అవకాశం ఉంది. జీబీసీకి ప్రత్యామ్నాయంగా కృష్ణా జలాలను తరలించడానికి వీలుంది. హంద్రీనీవా ఉపకాలువ ద్వారా ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద జలాలను జీబీసీలో కలపడానికి మార్గం ఉంది. ఏడు కి.మీ కాలువ, మరో ఏడు కి.మీ వంక ద్వారా కృష్ణా జలాలు కలుస్తాయి. ప్రత్యామ్నాయ కాలువలో ముళ్లకంపలు పెరిగాయి. వాటిని తొలగిస్తే నీరు సులభంగా అక్కడికి చేరుతుంది. ప్రస్తుతం హంద్రీనీవాలో ప్రవాహం ఆశాజనకంగా సాగుతోంది. తుంగభద్ర జలాలు ఆగిపోతాయని అధికారులు రెండు నెలలుగా ప్రకటిస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టే దిశగా వైకాపా సర్కారు చొరవ చూపలేదు. దీంతో వేలాది ఎకరాల్లో పంట దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది.
పంటలను కాపాడిన తెదేపా ప్రభుత్వం
సాగు చేసిన మిరప పంట
ప్రస్తుత పరిస్థితులే 2016లోనూ ఉండేవి. నవంబరులోనే తుంగభద్ర జలాలు ఆగిపోయాయి. ఆ సమయంలో కృష్ణా జలాలను తరలించడానికి అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అధికారులను సంప్రదించారు. నీటిని తరలించడానికి సాధ్యం కాదని చెప్పారు. ఈక్రమంలో ప్రైవేటుగా సర్వే చేయించి, నీటిని తరలించవచ్చని నిర్ధారణకు ఇచ్చారు. ఏడు కి.మీ మేర సొంత ఖర్చుతో కాలువ తవ్వించి.. కృష్ణా జలాలను జీబీసీకి సరఫరా చేయించి పంటలు కాపాడారు. ప్రస్తుతం ఆ నీటిని తరలించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా పాలకులు పట్టించుకోవడం లేదు.
ఆధునికీకరణకు సిద్ధం
- పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే
ప్రత్యామ్నాయంగా జీబీసీకి కృష్ణా జలాలను అందించి పంటలను కాపాడాల్సి ఉంది. ఈమేరకు సొంత ఖర్చులతో ప్రత్యామ్నాయ కాలువ ఆధునికీకరణకు సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం అడ్డుపడకపోతే వెంటనే పనులు చేపట్టడానికి సమాయత్తం అవుతాం. పంటలను కాపాడి రైతులను గట్టెక్కించాలన్నదే మా అభిప్రాయం.
తరలించి ఆదుకోవాలి
- దేవేంద్ర, ఉండబండ, విడపనకల్లు మండలం
జీబీసీ కింద పది ఎకరాల్లో మిరప సాగు చేశా. ఎకరాకు రూ.1.5 లక్షల చొప్పున ఖర్చు పెట్టాను. సాగునీరు సరఫరా ఆగి పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాం. కృష్ణా జలాలను జీబీసీకి తరలించే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆదుకోవాలి.
తీవ్రంగా నష్టపోతాం
- లోకేశ్, రాయంపల్లి, ఉరవకొండ మండలం
గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే పయ్యావుల కేశవ్ స్పందించి నీటి సరఫరా చేయించారు. దీంతో పంటలు కాపాడుకున్నాం. ప్రస్తుతం అలాంటి చర్యలు చేపట్టకపోతే తాము తీవ్రంగా నష్టపోతాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసైన్డ్ భూములపై వైకాపా గద్దలు
[ 27-07-2024]
జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన భూఅక్రమాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను దోచేసుకున్నారు. -
తల్లికి వందనం.. రెండింతల ఆనందం!
[ 27-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలుకానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. -
మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం: కలెక్టర్
[ 27-07-2024]
జిల్లాలో ఏ దశలోనూ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి. ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆగస్టు రెండో వారంలో హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీరు
[ 27-07-2024]
ఆగస్టు రెండో వారంలో జరిగే నీటి సలహా మండలి సమావేశం తీర్మానం మేరకు హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగునీటి విడుదలకు చర్యలు తీసుకొంటామని ఎస్ఈ రాజశేఖర్ పేర్కొన్నారు. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అలసత్వంతో క్షోభ.. వన్నెలద్దితేనే పర్యాటక శోభ
[ 27-07-2024]
అనంతపురం జిల్లా చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. -
సైనికుల కఠోర శ్రమను ప్రత్యక్షంగా చూశా
[ 27-07-2024]
‘సొంత ఊర్లకు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ.. దేశ రక్షణలో భాగంగా సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు, కఠోర శ్రమ అసమాన్యం. -
క్రీడాకారిణితో డీఎస్ఏ శిక్షకుడి అసభ్య ప్రవర్తన
[ 27-07-2024]
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ టేబుల్ (DSA) టెన్నిస్ శిక్షకుడు టి.ధనుంజయరెడ్డిని శాప్కు సరెండర్ చేశారు. -
డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో చోరీ
[ 27-07-2024]
గుంతకల్లు పట్టణంలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే