కన్నెత్తి చూశావా జగన్?
కరవు జిల్లా అనంతపై కనికరం లేదు. కర్షకుల కన్నీరు కనిపించదు. మాటలు కోటలు దాటుతాయ్.. అభివృద్ధి పనులు చేయడానికి చేతులాడవ్.. నీటి మీద రాత రాసే నైపుణ్యం.. ఇచ్చిన హామీ మడతపెట్టేయడం.. పైగా అందరికీ అన్నీ చేశానంటూ ఏ వేదిక ఎక్కినా ఊదరగొట్టడం జగన్ నైజం.
ఐదేళ్లలో ఒక అడుగు పని చేస్తే ఒట్టు
హెచ్చెల్సీ ఆధునికీకరణను గాలికి వదిలేసి.. ఓట్ల కోసం యాత్రనా?
కరవు జిల్లా అనంతపై కనికరం లేదు. కర్షకుల కన్నీరు కనిపించదు. మాటలు కోటలు దాటుతాయ్.. అభివృద్ధి పనులు చేయడానికి చేతులాడవ్.. నీటి మీద రాత రాసే నైపుణ్యం.. ఇచ్చిన హామీ మడతపెట్టేయడం.. పైగా అందరికీ అన్నీ చేశానంటూ ఏ వేదిక ఎక్కినా ఊదరగొట్టడం జగన్ నైజం. రూ.వందల కోట్లు మంజూరు చేస్తానని ఒక్క రూపాయి ఇవ్వని సీఎం.. ఐదేళ్లలో హెచ్చెల్సీ ఆధునికీకరణకు తట్ట మట్టి కూడా పోయించిన పాపాన పోలేదు. కాలువల రూపు కోల్పోయి.. దారుణంగా మారి ఆయకట్టుకు సక్రమంగా సాగునీరు అందని అనంత దయనీయ దుస్థితి.
ఈనాడు డిజిటల్, అనంతపురం-న్యూస్టుడే, కణేకల్లు, బొమ్మనహాళ్, ఉరవకొండ
హెచ్చెల్సీని బాగు చేస్తావని నమ్మితే మరింత బుగ్గి చేశావు. సమాంతర కాలువ నిర్మిస్తానని.. ఉన్న వాటికి గండ్లు పడేలా చేశావు. ఉమ్మడి అనంత జిల్లా పర్యటనల సందర్భంగా పలుసార్లు హామీలు గుప్పించావు. ఐదేళ్లలో కనీసం కన్నెత్తి ఇటువైపు చూశావా? ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నావు. అద్దాల బస్సులో నుంచి కిందకి దిగి అధ్వానంగా మారిన కాలువను ఒక్కసారి చూడు. హామీలు నమ్మి బలైన మా బతుకులు అందులో కనిపిస్తాయి. ఒక్క అవకాశం అన్నావు.. నమ్మాం, మోసపోయాం.. ఇంకోసారి నమ్మేందుకు సిద్ధంగా లేం.
హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆధునికీకరణపై సీఎం జగన్ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారాయి. ప్రతిపక్ష నేతగా, సీఎం అయ్యాక పలుమార్లు అనంత జిల్లా పర్యటనకు వచ్చారు. ప్రధాన కాలువను పటిష్ఠ పరిచి సామర్థ్యాన్ని పెంచుతామంటూ హామీలు గుప్పించి రైతుల ఓట్లు కొల్లగొట్టిన పెద్దమనిషి కనీసం తాత్కాలిక మరమ్మతులకూ నిధులు ఇవ్వలేదు. రూ.600 కోట్లు ఖర్చు చేయాల్సిన ఉండగా.. ఐదేళ్లలో ఐదు రూపాయాలూ మంజూరు చేయలేదు. పలు చోట్ల కాలువలు ధ్వంసమై తీవ్రస్థాయిలో నీటి నష్టం జరుగుతున్నా అరికట్టేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. పూర్తి సామర్థ్యంతో కర్ణాటక నుంచి నీరు తీసుకుంటే కాలువ తెగిపోతుందనే భయంతో ప్రవాహాన్ని తగ్గించుకునే స్థాయికి దిగజారారు. దీంతో చివరి ఆయకట్టు రైతులు నీరు అందక నష్టపోతున్నారు.
పనులు రద్దు చేసి..
హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులకు 2008లో శ్రీకారం చుట్టారు.రూ.458 కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.309 కోట్లు ఖర్చు చేసి 67 శాతం పనులు పూర్తి చేశారు. అయితే కొన్ని ప్యాకేజీల్లో 25 శాతం కంటే తక్కువ పనులు జరిగాయని వాటిని జగన్ సర్కార్ రద్దు చేసింది. ఇప్పటివరకు మళ్లీ టెండర్లు పిలిచింది లేదు.. ఆలస్యం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. మిగిలిన పనులకు రూ.600 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ మోక్షం లభించలేదు.
రూ.36 కోట్లూ లేవా?
రెండేళ్ల కిందట తాత్కాలిక మరమ్మతులకు రూ.36 కోట్లు అవసరమని అధికారులు పంపిన ప్రతిపాదనలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కాలువకు తరచూ గండ్లు పడి నీరు వృథాగా పోతున్నాయి.Åకాలువ గట్లు దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువపై నాలుగు వంతెనలు కూలిపోయాయి. కొన్నిచోట్ల రైతులే ముందుకు వచ్చి సొంత డబ్బులతో తాత్కాలిక మరమ్మతు చేయించుకున్నా.. వైకాపా సర్కారులో ఏమాత్రం చలనం లేదు.
- హెచ్చెల్సీ ప్రధాన కాలువ: 84 కిలోమీటర్లు
- ఆయకట్టు: 1.45 లక్షల ఎకరాలు
- 2019 వరకు జరిగిన పనులు: 67 శాతం
- చేసిన ఖర్చు: రూ.309 కోట్లు
- జగన్ ప్రభుత్వంలో పరిస్థితి: అధికారంలోకి రాగానే పనుల రద్దు. ఇప్పటివరకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లలో వెలగని అనంత క్రీడాజ్యోతి
[ 26-07-2024]
ఆటల్లో అరంగ్రేటం ప్రతి ఆటగాడి కల. ఒలింపిక్స్లో ఆడాలన్నదే...విశ్వక్రీడల్లో ఒక్క పతకం సాధిస్తే చాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు మారుమోగుతుంది. ఒలింపిక్స్లో స్వర్ణం, రజతం, కాంస్యం ఏ పతకమైనా సాధిస్తే కోట్ల మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. -
గుట్టు వీడుతోంది.. స్త్రీ నిధి సొమ్ము కాజేసిన ఉద్యోగులు
[ 26-07-2024]
మహిళలు స్వయం ఉపాధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు అప్పుగా తీసుకున్న సొమ్ము అక్రమార్కులకు వరంగా మారింది. మహిళలు పైసా పైసా కూడబెట్టిన సొమ్మును డీఆర్డీఏ-వెలుగు ఉద్యోగులు వాటాలు వేసుకుని స్వాహా చేస్తున్నారు. -
9 నెలల్లో 17 మాతృ మరణాలా?
[ 26-07-2024]
‘క్షేత్రస్థాయిలో వైద్య, ఆరోగ్య సిబ్బందిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. తొమ్మిది మాసాల్లో 17 మంది తల్లులు చనిపోయారంటే ఆషామాషీగా తీసుకోవద్దు. మాతృ మరణాలు ఎలా సంభిస్తున్నాయి’ అంటూ కలెక్టర్ వినోద్కుమార్ ప్రశ్నించారు. -
కొత్త ఎస్పీలు.. వేళ్లూనుకున్న సవాళ్లు
[ 26-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దౌర్జన్యాలు రాజ్యమేలాయి. అధికార పార్టీ నాయకుల అండతో కార్యకర్తలు రెచ్చిపోయి తెదేపా సానుభూతిపరులపై అనవసరంగా కేసులు నమోదు చేయించారు. -
ఎమ్మెల్యే ఔదార్యం.. డీఎస్సీ శిక్షణార్థులకు వరం
[ 26-07-2024]
కరవుసీమలో వేలకు వేలు ఖర్చు చేసి డీఎస్సీకి సాధన అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.. వారి కష్టాలను అర్థం చేసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ఉచితశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. సొంత ఖర్చులతో రాష్ట్రంలోని ఉత్తమ శిక్షకులను రప్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. -
20 శాతం పనులే పూర్తి
[ 26-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆసుపత్రి విస్తరణలో భాగంగా పలు విభాగాలకు ప్రత్యేక భవనాలు నిర్మించి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పనుల కింద 2020లో రూ.300 కోట్లు కేటాయించింది. -
ఉగ్రరూప.. తుంగభద్ర
[ 26-07-2024]
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 80 వేల క్యూసెక్కుల దాకా వరద వచ్చి చేరుతుండటంతో జలాశయంలోని 33 గేట్లకుగాను 28 గేట్లను పైకెత్తి 72 వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. -
వీడని గుర్తుతెలియని మృతదేహాల మిస్టరీ
[ 26-07-2024]
గుర్తు తెలియని శవాల ఆచూకీ మిస్టరీగా ఉంటోంది. పట్టణం, గ్రామ ప్రాంతాల్లోనే కాకుండా రైల్వే లైన్లో పలు శవాలు లభ్యం అవుతుండడంతో పోలీసులు కేసులను నమోదు చేసి విచారణ చేస్తుంటే కొన్ని శవాల ఆచూకీ లభిస్తుండగా మరికొన్నింటి సమాచారం వెలుగులోకి రావడం లేదు. -
వ్యాపారం.. ఘరానా మోసం
[ 26-07-2024]
నల్లచెరువు మండల కేంద్రంలో మూడు నెలల కిందట వ్యాపారం నిమిత్తం వచ్చిన ఉమామహేశ్వరెడ్డి పలువురిని మోసం చేసి ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. -
రిలయన్స్ మార్ట్ ధ్వంసం కేసు..
[ 26-07-2024]
రిలయన్స్ మార్ట్ను ధ్వంసం చేసిన కేసును అనంతపురం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న రిలయన్స్ మార్ట్ను రాజశేఖర్రెడ్డి అభిమానులు, ప్రస్తుత వైకాపా నాయకులు 2009లో దాడి చేసి నిప్పు పెట్టారనేది ఆరోపణ. -
భారీగా గోవా మద్యం పట్టివేత
[ 26-07-2024]
రాయదుర్గం మీదుగా అనంతపురానికి అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పెద్దఎత్తున పట్టుబడింది. సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు సీఐలు వెంకటలక్ష్మమ్మ, మురళీమోహన్ తమ సిబ్బందితో కలిసి గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
-
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం