‘అచ్చెన్నాయుడుది దిగజారుడు రాజకీయం’
పోలీసులను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అమర్యాదగా మాట్లాడడం సరికాదని జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు మురళి అన్నారు.
మాట్లాడుతున్న జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్
చిత్తూరు గ్రామీణ : పోలీసులను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అమర్యాదగా మాట్లాడడం సరికాదని జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు మురళి అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా అచ్చెన్నాయుడు పోలీసు శాఖ తీరుపై అనుచిత వ్యాఖలు చేయడం దిగజారుడు రాజకీయమన్నారు. సంస్కారంతో మాట్లాడాలని హెచ్చరించారు. సంఘం సభ్యులు మునిరాజులు, వేణు, సుదర్శన్ పాల్గొన్నారు. తెదేపా నేత విజ్ఞత మరచి పోలీసు వ్యవస్థపై ఆరోపణలు చేయడం సరికాదని జిల్లా పోలీసు యూనియన్ అధ్యక్షుడు ఉదయ్ అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన విలేకర్ల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ పోలీసులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారన్నారు. 700 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నా.. సభ్యత, సంస్కారం మరచి.. పోలీసు వ్యవస్థపై దిగజారుడు మాటలు అనడం మంచిది కాదన్నారు. వ్యాఖ్యల్ని వెనక్కితీసుకొని, క్షమాపణ చెప్పాలన్నారు. ఖాదర్భాషా, శరవరణ, రమేష్ పాల్గొన్నారు.
ఎస్పీకి ఫిర్యాదు..
చిత్తూరు (నేరవార్తలు), న్యూస్టుడే: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని పోలీసు సంఘం అధ్యక్షుడు ఉదయ్, సంఘం నాయకులు, పోలీసులు ఎస్పీ రిషాంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. లోకేష్ పాదయాత్రకు 500 మంది పోలీసులతో భద్రత కల్పించామని చెప్పటంపై అచ్చెన్నాయుడు అసభ్యకరమైన పదజాలాన్ని వాడారని మండిపడ్డారు. దీనిపై ఎస్పీ రిషాంత్రెడ్డి స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు సరికావని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం