నూతన ఆలోచనలకు కార్యరూపం
యువతలో ఉన్న నూతన ఆలోచనలను ఆవిష్కరణల రూపంలో తీసుకురావడానికి ‘ప్రమోటింగ్ ఇన్నోవేషన్స్ అండ్ ఇండివిజువల్స్ స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈ’ (ప్రిజం)...
మహిళా వర్సిటీ(తిరుపతి), న్యూస్టుడే: యువతలో ఉన్న నూతన ఆలోచనలను ఆవిష్కరణల రూపంలో తీసుకురావడానికి ‘ప్రమోటింగ్ ఇన్నోవేషన్స్ అండ్ ఇండివిజువల్స్ స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈ’ (ప్రిజం) వేదికగా పని చేస్తుందని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇన్ఛార్జి వీసీ రాజారెడ్డి పేర్కొన్నారు. వర్సిటీలో ఐదేళ్ల క్రితం డీఎస్ఐఆర్-ప్రిజం పథకం ప్రభావం, అధ్యయన నివేదికపై కార్యశాల నిర్వహించారు. వర్సిటీ సావేరి సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి వీసీ ముఖ్య అతిథిగా విచ్చేసి సావనీర్ను విడుదల చేశారు. అనంతరం డీఎస్ఐఆర్ మెంబర్ సెక్రటరీ రామానుజ బెనర్జీ మాట్లాడుతూ యువత, నిపుణులు, రైతులు, గృహిణుల్లో ఉన్న నూతన వ్యాపార, వాణిజ్య ఆలోచనలు ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించడమే ప్రిజం లక్ష్యమన్నారు. ఈ పథకం కింద ఎంపికైన ఇన్నోవేటర్ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి రూ. 2 లక్షల నుంచి రూ. 50లక్షల వరకు నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. డీఎస్ఐఆర్ సంచాలకులు పీ.కే.దత్తా, డీఎస్టీ మాజీ కార్యదర్శి రామస్వామి, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం డైరెక్టర్ జనరల్ ఆచార్య సచిన్ చతుర్వేది, మహిళా వర్సిటీ ప్రిజం ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఉమామహేశ్వరిదేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం