Venkatagiri: రోడ్డేస్తున్నా.. రూపాయి రాలేదు జగనన్నా
వైకాపా ప్రభుత్వం రోడ్ల బాగుకు రూపాయి ఇవ్వడం లేదు. బిల్లులు రాక రహదారి పనులు పూర్తికాక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. వెంకటగిరి-గూడూరు మార్గంలో రోడ్డు విస్తరణ పనులు ఏడాదిన్నరగా సాగకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే 17 నెలలు గడిచిపోగా మరో నెల గడువు మాత్రమే ఉంది.
రూ.10 కోట్ల బకాయిలకు మోక్షమేదీ?
నిలిచిన వెంకటగిరి-గూడూరు విస్తరణ పనులు
మరో నెలలో గడువు పూర్తి
తారు రోడ్డు దుస్థితి
వెంకటగిరి, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం రోడ్ల బాగుకు రూపాయి ఇవ్వడం లేదు. బిల్లులు రాక రహదారి పనులు పూర్తికాక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. వెంకటగిరి-గూడూరు మార్గంలో రోడ్డు విస్తరణ పనులు ఏడాదిన్నరగా సాగకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే 17 నెలలు గడిచిపోగా మరో నెల గడువు మాత్రమే ఉంది. సెంట్రల్ రోడ్ ఫండ్తో ఈ పనులు చేపట్టగా గుత్తేదారులకు రూపాయి చెల్లించకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
- 20 కల్వర్టులను తొలుత విస్తరించగా వీటి పరిధిలోని అప్రోచ్ పనులు పూర్తికాక వాహన చోదకులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ప్రభావంతో పనులు మరింత మందగించే పరిస్థితి. వెంకటరెడ్డిపల్లి నుంచి బాలాయపల్లి వరకు 5 కి.మీ మేర రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయగా.. అక్కడి నుంచి వెంకటగిరి వరకు ఉన్న 16 కి.మీ పనులు నిలిచిపోవడం శాపంగా మారింది.
నిత్య నరకం
వెంకటగిరి నుంచి గూడూరు మీదుగా నిత్యం నెల్లూరు వెళ్లే ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఇతర వాహన చోదకులకు ఈ మార్గంలో నరకం కనబడుతోంది. కల్వర్టుల వద్ద విస్తరణ పనులు పూర్తిచేసిన గుత్తేదారుడు ఇక్కడ వెట్మిక్స్ను రోడ్డుకు ఇరువైపులా వేసి వదిలేశారు. తారు పనులు చేయకపోవడంతో వాహన రాకపోకలతో పూర్తిగా లేచిపోయింది. కంకరతేలి ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఆటోలు, ఇతర వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతేనే పనులు చేపట్టే అవకాశం ఉంది.
బిల్లుల కోసం నివేదించాం
ఇప్పటివరకు చేసిన పనులకుగాను రూ.10 కోట్ల మేర బిల్లులు ప్రభుత్వానికి నివేదించాం. చెల్లింపులు పెండింగ్లో ఉండటంతో గుత్తేదారుడు పనులు నిలిపేశారు.. త్వరలో పనులు పునఃప్రారంభించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
బాబు, ర.భ.శాఖ ఏఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం