YS Jagan: ‘ఆ నలుగురు చాలు ఓడించేందుకు’.. ఎమ్మెల్యే కిలివేటితో సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి, చెంగాళమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి కలిశారు.
ఈనాడు, తిరుపతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(YS Jagan) శుక్రవారం తాడేపల్లిలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి, చెంగాళమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. సూళ్లూరుపేట అభ్యర్థిత్వంపై చర్చకు వచ్చింది. సూళ్లూరుపేటలో డాక్టర్ గోపీనాథ్ గట్టి పోటీ ఇవ్వలేరని సత్యనారాయణరెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలుగజేసుకున్న సీఎం.. గోపీనాథ్ అని ఎవరు చెప్పారన్నారు. సంజీవయ్యను సత్యవేడుకు పంపి, తిరుపతి ఎంపీ గురుమూర్తిని సూళ్లూరుపేటకు తీసుకురావాలని అన్నట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తనకు తమిళం రాదని చెప్పారు. నీకు తమిళం వచ్చని అనుకున్నానని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. నిన్ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారని అనగా.. నన్ను వ్యతిరేకిస్తున్నది నలుగురు మాత్రమేనని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. ఆ నలుగురు చాలు ఓడించేందుకు అని సీఎం అన్నట్లు సమాచారం. గెలిపించడం చాలా కష్టమని, ఓడించడం చాలా సులువు అని కూడా ఈ సందర్భంగా జగన్ అన్నారని తెలిసింది. చివరగా సీఎం వెళ్తూ.. ధనంజయరెడ్డిని మాట్లాడమని సూచించినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల