YS Jagan: వై నాట్ 175 అన్నారు.. రెబల్ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు..
వైనాట్ 175.. 175 నియోజకవర్గాల్లో గెలుస్తున్నాం.. వైనాట్ కుప్పం అంటూ.. రెండేళ్ల క్రితం కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. కుప్పం గెలిచేస్తున్నట్లు ప్రచారాలు సైతం చేసుకున్నారు.
కుప్పం పట్టణం, న్యూస్టుడే: వైనాట్ 175.. 175 నియోజకవర్గాల్లో గెలుస్తున్నాం.. వైనాట్ కుప్పం అంటూ.. రెండేళ్ల క్రితం కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (YS Jagan) అన్నారు. కుప్పం గెలిచేస్తున్నట్లు ప్రచారాలు సైతం చేసుకున్నారు. అయితే కుప్పంలో వైకాపా శ్రేణుల మధ్య సఖ్యత లేక తరచూ జిల్లా పెద్దల వద్దకు పంచాయితీ చేరుకుంటోంది. అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి, పార్టీ మారి వచ్చిన వారికి ఛైర్మన్లుగా అవకాశం ఇస్తున్నారని.. ‘నష్ట పోయిన కార్యకర్తలు’ పేరిట అప్పట్లో వైకాపా నాయకులు సభ్యులుగా ఏర్పడి, అధికార పెద్దల వద్ద పంచాయితీ నిర్వహించడంతో వారు నచ్చజెప్పారు. ఇప్పటికే కుప్పంలో ఎమ్మెల్సీ, జిల్లా వైకాపా భరత్ రేసులో ఉండగా.. రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాను రెబల్గా పోటీ చేస్తున్నట్లు వాసనాడు మాజీ సర్పంచి మురళి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటిస్తున్నారు. కుప్పంలోని మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా రోజుకొకరు బరిలో ఉంటామని ప్రకటనలు చేస్తుండటంతో అధికార పార్టీకి రెబల్స్ బెడదగా మారింది.
మురళి
పార్టీ నాయకులు మోసం చేశారు..: అధికారం వస్తే సముచిత స్థానం కల్పిస్తామని ఆశ చూపి.. చివరికి అధికారం వచ్చిన తర్వాత సర్పంచి స్థానం కూడా కల్పించలేదని కుప్పం మండలం వాసనాడు గ్రామ పంచాయతీ పరిధిలోని మాజీ సర్పంచి మురళి తెలిపారు. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో వైకాపా తరఫున సర్పంచిగా గెలుపొంది పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డానని, చివరికి పార్టీ అధికారం వచ్చిన తర్వాత తనను పక్కన పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు మురళి వెల్లడించారు. అధికార పార్టీ నాయకులు మోసం చేశారంటూ గతంలో ‘నష్టపోయిన కార్యకర్తలు’ పేరిట పలు కార్యక్రమాలు కుప్పం ప్రాంతంలో చేసినట్లు వివరించారు. అప్పట్లో స్థానికంగా కష్టపడిన నాయకులను గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పార్టీ అభ్యున్నతికి తాము కష్టపడ్డామని చెప్పారు. కుప్పం వ్యవసాయ కమిటీ ఛైర్మన్గా అవకాశం కల్పించాలని అప్పట్లో జిల్లా స్థాయి నాయకులను కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమలా.. మా మద్దతు మీకే
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి