Tirupati: నే చూసుకుంటా.. నువ్వు అమ్మేయ్!
రెవెన్యూ రికార్డులు, ఆన్లైన్లోనూ అది ప్రభుత్వ భూమే. పైగా న్యాయస్థానంలో కేసు నడుస్తోంది.
ప్రభుత్వ భూమిలో స్థిరాస్తి వ్యాపారం!
వైకాపా నేత అండతో దందా
ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు
ఈనాడు-తిరుపతి; న్యూస్టుడే, మంగళం: రెవెన్యూ రికార్డులు, ఆన్లైన్లోనూ అది ప్రభుత్వ భూమే. పైగా న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ స్థలం జోలికి వెళ్లకూడదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందిన కాడికి దోచుకోవాలని ఆరాటపడుతున్న ఓ వైకాపా నేత అండగా నిలవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. సదరు స్థలంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. అందులో నిర్మాణాలు చేస్తున్నారు. ఇదీ రేణిగుంట మండలంలో అధికార పార్టీ నేత ఆధ్వర్యంలో నడుస్తున్న కబ్జాపర్వం.
రేణిగుంట మండలం అన్నాసామిపల్లిలోని సర్వే నంబరు 385లో 31.65 ఎకరాల భూమి ఉంది. దీన్ని 2012 ఏప్రిల్లోనే అనాధీనం (ప్రభుత్వ భూమి)గా పేర్కొంటూ మ్యుటేషన్ చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. భూ రిజిస్టర్తోపాటు రెంట్ రిజెక్షన్ చట్టం 1947ని అనుసరించి అన్నాసామిపల్లె గ్రామంలోని సర్వే నంబరు 385 పట్టా భూమి కాదని ప్రత్యేక కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ 1997లోనే ఉత్తర్వులు ఇచ్చారు. రెంట్ రిజెక్షన్ చట్టాన్ని గ్రామానికి వర్తించే సమయంలో ఇక్కడ 16.50 ఎకరాల మేరకు మాత్రమే పట్టా భూమి ఉందని స్పష్టం చేశారు. అందువల్ల సర్వే నంబరు 385లోని భూమి రైత్వారీ భూమి కాదని నిర్ధారించారు. దీంతో 1986లో నెల్లూరు సెటిల్మెంట్ అధికారి కొందరి పేరిట జారీ చేసిన రైత్వారీ పట్టాలను సైతం రద్దు చేశారు. ఆపై సీసీఎల్ఏ (అప్పీల్స్) కొందరు వ్యక్తులకు అనుకూలంగా ఆదేశాలివ్వడంతో ప్రభుత్వం దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
అడ్డగోలుగా విక్రయాలు
న్యాయస్థానంలో కేసు నడుస్తుండటంతోపాటు రెవెన్యూ రికార్డుల్లో ప్రస్తుతం ఎక్కడా ప్రైవేటు వ్యక్తుల పేర్లు పొందుపర్చలేదు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం మొదలుపెట్టారు. సుమారు 24 అంకణాలు (96 గజాలు) రూ.7 లక్షలకు విక్రయిస్తున్నారు. కొనుగోలు చేస్తున్న వ్యక్తులకు రూ.100 స్టాంపు పేపరుపై రాసి ఇస్తున్నారు. ఎక్కడా రిజిస్ట్రేషన్లు చేయట్లేదు. ఇబ్బంది వస్తే తాము చూసుకుంటామని, ఇళ్లు నిర్మించుకోవచ్చని నమ్మబలుకుతున్నారు.
రికార్డుల్లో లేకుండానే
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబరు 385లోని భూమి ప్రభుత్వ భూమిగానే చూపిస్తున్నారు. 2019లో అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎఫ్8/4495/2013 కింద రిజిస్ట్రేషన్లు చేయకుండా సర్వే నంబరును నిషేధిత జాబితాలోనూ పొందుపర్చారు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు చేసుకోకుండా నిబంధనలు అతిక్రమించి విక్రయాలు ఎలా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న వ్యక్తుల వెనుక కొందరు వైకాపా నేతలు ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికలు పూర్తయ్యే నాటికి వీలైనన్ని ప్లాట్లు విక్రయించాలని చూస్తున్నారు. న్యాయస్థానంలో అది ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తే నష్టపోయేది నిరుపేదలేనన్న వాదనలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్