logo

సర్వదర్శనానికి 24 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులకు దాదాపు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది.

Published : 13 Apr 2024 01:50 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులకు దాదాపు 24 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. గురువారం శ్రీవారిని 62,366 మంది దర్శించుకున్నారు. రూ.3.01 కోట్ల హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.


కాణిపాకం ఆలయ ఉద్యోగి తొలగింపు!

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ భజంత్రీ ఉద్యోగ విరమణ వయసు దాటినా 18 నెలల పాటు జీతభత్యాలు చెల్లించిన ఘటనలో బాధ్యులపై చర్యలు చేపట్టారు.  సదరు సెక్షన్‌ చూస్తున్న ఒప్పంద ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. సూపరింటెండెంట్‌కు మెమో ఇస్తూ ఈవో ఎ.వెంకటేశు శుక్రవారం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని