logo

త్వరలో నారా భువనేశ్వరి కుప్పం పర్యటన

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి ఈ నెల మూడో వారంలో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక పార్టీ వర్గాలకు సమాచారం అందినట్లు తెలిసింది.

Published : 13 Apr 2024 01:52 IST

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి ఈ నెల మూడో వారంలో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక పార్టీ వర్గాలకు సమాచారం అందినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు ఉండే ఈ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. చంద్రబాబు తరుఫున ప్రచారం చేస్తారని తెలిసింది.


రేపటి నుంచి షర్మిల పర్యటన

 తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ న్యాయ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడ్రోజులు పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తిలో, సాయంత్రం 4 గంటలకు సత్యవేడులోని గాంధీ విగ్రహం సమీపంలో.. రాత్రి 7.30కు పుత్తూరులో స్థానిక నాయకులతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం 10.30 కార్వేటినగరంలో రోడ్డుషో, సమావేశం; 11.30: జీడీనెల్లూరులో, సాయంత్రం 5 గంటలకు పలమనేరు, రాత్రి 7.30 గంటలకు పూతలపట్టులో స్థానిక నాయకులతో సమావేశం  నిర్వహించనున్నారు. 16న అన్నమయ్య జిల్లా పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెలో స్థానిక నాయకుల సమావేశంలో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని