కొండను కొట్టి.. అమ్మకానికి పెట్టి!
ఎన్నికల తర్వాత ఎలాగూ తమ ప్రభుత్వం రాదని గ్రహించిన వైకాపా నేతలు అయిన కాడికి దండుకునేందుకు బరితెగిస్తున్నారు. రామచంద్రాపురం మండలం సి.రామాపురం పరిధిలో జగనన్న కాలనీని ఆనుకుని ఉన్న కొండను కొట్టి ప్లాట్లు చేసి విక్రయాలు ప్రారంభించారు.
సి.రామాపురంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరుల దంద్ఞా
సి.రామాపురంలో ధ్వంసమైన కొండ
ఈనాడు-తిరుపతి: ఎన్నికల తర్వాత ఎలాగూ తమ ప్రభుత్వం రాదని గ్రహించిన వైకాపా నేతలు అయిన కాడికి దండుకునేందుకు బరితెగిస్తున్నారు. రామచంద్రాపురం మండలం సి.రామాపురం పరిధిలో జగనన్న కాలనీని ఆనుకుని ఉన్న కొండను కొట్టి ప్లాట్లు చేసి విక్రయాలు ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ముఖ్య అనుచరులు నెరపుతుండటంతో అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు సాహసించడం లేదు.
అవిలాల - రామచంద్రాపురం మార్గానికి సమీపంలోని సి.రామాపురం వద్ద కొండను కొంతమేరకు చదును చేసి గతంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. మిగిలిన కొండపై కన్నేసిన వైకాపా నేతలు జేసీబీలతో చదును చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు తవ్వి ప్లాట్లుగా మార్చారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అండతోనే అనుచరులు కొండను తొలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల్లో పంచేందుకు కూడబెడుతూ..
కొండను తొలచి స్థలాలు విక్రయించగా.. వచ్చే సొమ్ములో కొంత ఎన్నికల్లో పంచి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రావెల్ను సైతం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికీ అక్కడ జేసీబీతో పనులు చేస్తున్నారు.
అధికారుల కళ్లకు గంతలు..
రహదారి పక్కనే ఈ కబ్జాకాండ సాగుతున్నా రెవెన్యూ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ