రెండింటా.. ఏడో స్థానం
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విద్యార్థులు తమ స్థానం కొనసాగించారు. ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచారు.
మొదటి ఏడాది 70%..
రెండో ఏడాది 81% ఉత్తీర్ణత
తిరుపతి(భైరాగిపట్టెడ), న్యూస్టుడే: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తిరుపతి విద్యార్థులు తమ స్థానం కొనసాగించారు. ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచారు. జిల్లాల పునర్విభజన తరువాత మొదటిసారిగా వేర్వేరుగా జరిగిన ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనూ రాష్ట్రస్థాయిలో తిరుపతి ఏడోస్థానం సాధించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 29,915 మందికిగాను 20,919 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 25,990 మందికిగాను 21,062 మంది పాల్గొన్నారు. వృత్తివిద్య కోర్సుల్లో మొదటి సంవత్సరంలో మొత్తం 1086 మందికిగాను 595 మంది (55%) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 500 మందికిగాను 345 మంది (69%).. బాలురు 586 మందికిగాను 250 మంది (43%) ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 486 మందికిగాను 404 మంది (83%) ఉత్తీర్ణత పొందారు. బాలురు 477 మంది హాజరుకాగా 245 మంది (52%) ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 963 మందికిగాను 652 మంది (68%) ఉత్తీర్ణత పొందారు.
వృత్తివిద్య కోర్సుల్లో చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల 67.72, 88.33 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆర్ఐవో వెల్లడించారు.
వందశాతం ఉత్తీర్ణత
సత్యవేడు, న్యూస్టుడే: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అంబేడ్కర్ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 88మంది పరీక్షలకు హాజరు కాగా 88 మంది, మొదటి సంవత్సరం విద్యార్థులు 73 మందికి 73మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ జగన్మోహన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల