logo

కీలక నేత కుటుంబీకుల ఇసుక దందా

చంద్రగిరి నియోజకవర్గంలో కీలక నేత కుటుంబీకులు నాగయ్యగారిపల్లి పరిధిలో భారీ యంత్రాలతో ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారు.

Published : 13 Apr 2024 02:26 IST

చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో కీలక నేత కుటుంబీకులు నాగయ్యగారిపల్లి పరిధిలో భారీ యంత్రాలతో ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగులు వైకాపా నేతలకు సహకరిస్తుండగా ఉన్నతాధికారులు తమ దృష్టికి రాలేదని దాటేస్తున్నారు. స్వర్ణముఖి నదీపరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే పెద్దఎత్తున ఇసుక తోడేయడంతో బావులు, గొట్టపు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారులకు ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ.3,300 చెల్లించి బిల్లులతో ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు చెబుతుండగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని విపక్ష నాయకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని