ప్రథమం అథమం.. ద్వితీయం దిగదిడుపు
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఇంటర్ ఫలితాల సాధనలో చిత్తూరు జిల్లా చతికిలబడింది. రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా.. చిత్తూరు జిల్లా ఫలితాల్లో చివరి రెండు స్థానాలకు పరిమితమైంది.
ఇంటర్ ఫలితాల్లో చివరి రెండు స్థానాలకు పరిమితం
జిల్లాలో బాలికలదే పైచేయి..
ఇంటర్ ఫలితాల్ని విడుదల చేస్తున్న డీవీఈవో సయ్యద్మౌలా
చిత్తూరు కలెక్టరేట్, విద్య, న్యూస్టుడే: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఇంటర్ ఫలితాల సాధనలో చిత్తూరు జిల్లా చతికిలబడింది. రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా.. చిత్తూరు జిల్లా ఫలితాల్లో చివరి రెండు స్థానాలకు పరిమితమైంది. ఇంటర్ ద్వితీయ ఫలితాల్లో జిల్లా 63 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానానికి (26వ స్థానం) దిగజారింది.. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 50 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లా ఫలితాల్ని డీవీఈవో సయ్యద్ మౌలా శుక్రవారం విడుదల చేశారు.. ఫలితాల్లో బాలికలిదే పైచేయిగా నిలిచింది.
ప్రభుత్వ కళాశాలల్లో ఇలా..
ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత 50 శాతం దాటకపోవడం గమనార్హం. ప్రథమ ఇంటర్ ఫలితాల్లో 2,581 మంది హాజరవగా 806 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,372 హాజరుకాగా 272 ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1,234 హాజరుకాగా 534 మంది ఉత్తీర్ణలయ్యారు. ద్వితీయ ఇంటర్లో 2,240 మందికిగానూ 1,083 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,118 మందికిగానూ 456 మంది, బాలికలు 1,122 మందికిగానూ 627 మంది ఉత్తీర్ణత సాధించారు.
- ఒకేషనల్ ఇంటర్ ఫలితాలు కాస్త పర్వాలేదనిపించాయి. ప్రథమంలో 1,360 మంది హాజరుకాగా 647 మంది ఉత్తీర్ణుల య్యారు. ఉత్తీర్ణత శాతం 48. బాలురు 868 మందికిగానూ 328 మంది, బాలికలు 492 మందికిగానూ 319 ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ ద్వితీయంలో 1,144 మందికిగానూ 682 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 691 మందికిగానూ 335 మంది, బాలికలు 453 మందికిగానూ 347 మంది ఉత్తీర్ణులయ్యారు.
- ఒకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 1,839 మందికి 941 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 1,055 మందికిగానూ 426 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 784 మందికి.. 515 మంది ఉత్తీర్ణులయ్యారు.
- ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1,610 మంది హాజరవగా 1,008 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 910 మందికి.. 463 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 700 మందికి.. 545 మంది ఉత్తీర్ణులయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల