ఇంటింటి ప్రచారంపై స్టేషన్కు సమాచారం తప్పనిసరి
దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడ్డ వారు ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియపై ఓటర్ల సుముఖతపై ఈ నెల 20 నుంచి 23 సర్వే చేపట్టనున్నామని, దీనికోసం 12డి దరఖాస్తు ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
మాట్లాడుతున్న కలెక్టర్ షన్మోహన్, పక్కనే జేసీ శ్రీనివాసులు
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే: దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడ్డ వారు ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియపై ఓటర్ల సుముఖతపై ఈ నెల 20 నుంచి 23 సర్వే చేపట్టనున్నామని, దీనికోసం 12డి దరఖాస్తు ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో జేసీ శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్యతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల సిబ్బంది శిక్షణలో పాల్గొనకుంటే సస్పెండ్ చేస్తాం. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం విషయంలో స్థానిక పోలీస్స్టేషన్ అధికారికి సమాచారమివ్వాలి. డిజిటల్ వాహనాలకు అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ భవనాలపై పార్టీ గుర్తులు, పార్టీ జెండాలు ఉంటేనే చర్యలు తీసుకుంటాం. రంగులపై ఉల్లంఘనలు లేవు. ఈ నెల 18న ఎన్నికల ప్రకటన వెలువడనుంది. నామినేషన్ల రోజు నుంచి ఖర్చులు అభ్యర్థి ఖాతాకే జమవుతాయి. సివిజిల్ యాప్నకు 368 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలో ఇప్పటివరకూ తనిఖీల్లో రూ.2,29,66,410 నగదు, రూ.4,47,35,387 విలువ చేసే బంగారు(5 కిలోలు), వెండి (100 కిలోలు), రూ.46,98,845 విలువ చేసే బియ్యం, గోడ గడియారం, కుక్కర్లు, డ్రెస్ మెటీరియల్స్, 5,650 లీటర్ల లిక్కర్ సీజ్ చేశాం’ కలెక్టర్ పేర్కొన్నారు.
చిత్తూరు గంగమ్మ జాతర తేదీలు మార్చుకోవాలి: ఎంసీసీ అమలు నేపథ్యంలో గంగమ్మ జాతరపై నిర్వాహకులు అనుమతి తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మే 13న పోలింగ్ నేపథ్యంలో తర్వాత రోజు జాతర జరిగితే బందోబస్తుకు ఇబ్బందులు ఉంటాయన్నారు. జాతర రోజున ఆలయాల్లో మాత్రమే పూజలు చేస్తే బాగుంటుందన్నారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలి: జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉందని, ఎవరూ వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తం చేయాలన్నారు. జడ్పీ సీఈవో గ్లోరియా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్కుమార్, డీపీవో లక్ష్మి పాల్గొన్నారు. ః ఈసీ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్ల మొదటి ర్యాండమైజేషన్ను పూర్తి చేశామని కలెక్టర్ షన్మోహన్ అన్నారు.
రంజాన్ ఉద్రిక్తతలో అభ్యర్థులపై కేసులు: ‘చిత్తూరులో రంజాన్ రోజు ఈద్గా మైదానంలో మత ప్రార్థనల సమయంలో ఉద్రిక్తత నెలకొనడంపై ఫిర్యాదులు వచ్చాయి. అక్కడున్న ఇరు పార్టీల అభ్యర్థులపై 171 సెక్షన్ కింద కేసులు పెట్టామని’ కలెక్టర్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం