వసూల్రాజా ఎంతిచ్చినా తీసుకోండి: షర్మిల ఘాటు వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం భారీగా తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వసూల్రాజా ఎంత ఇచ్చినా మొహమాటం లేకుండా తీసుకోండి అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి..
శ్రీకాళహస్తిలో ప్రజలకు కరచాలనం ఇస్తున్న షర్మిల
శ్రీకాళహస్తి, సత్యవేడు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం భారీగా తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వసూల్రాజా ఎంత ఇచ్చినా మొహమాటం లేకుండా తీసుకోండి అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని మట్టి మాఫియా, ఇసుక అక్రమాలకు పెట్టింది పేరుగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఖాళీ భూములన్నీ ఆక్రమిస్తూ కబ్జాల రాజా ఎంతో ఎదిగారని తెలిపారు. ఈయనకు పన్నులు కట్టలేక యాజమాన్యాలు పరిశ్రమలు మూసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి వ్యక్తికి మళ్లీ టికెట్ ఇచ్చారని, ఓటు కోసం ఆయన ఎంతైనా ఇస్తాడని, ఇచ్చేదంతా ప్రజల డబ్బేనని దంచి వసూలు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేష్నాయుడు మాట్లాడుతూ మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా మన్నవరం భెల్ పరిశ్రమను అందుబాటులోనికి తీసుకురావడం, గాడి తప్పిన ఏరియా ఆస్పత్రిలో సేవలు అందించేలా చేయడం, స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్టీయూలో విలీనం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం ఏరియా కార్యదర్శి పుల్లయ్య, సీపీఐ ఏరియా కార్యదర్శి గురవయ్య, పలువురు నేతలు ప్రసంగించారు. ః శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సీటు మహిళలకు కేటాయించాలంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ ప్లకార్డులతో సభాస్థలి వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తెయ్యనాయుడు వర్గీయులు షర్మిల సభకు డుమ్మా కొట్టారు.
వైకాపాకు ఓటేస్తే పెద్దిరెడ్డిదే పెత్తనం
సత్యవేడు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ను గెలిపిస్తే ప్రతి సమస్య పరిష్కారానికి ప్రజలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లాల్సి వస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. సత్యవేడులో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సత్యవేడులో పెత్తనమంతా పెద్దిరెడ్డిదేనని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి బాలగురువం బాబు, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి