18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుంది. 18 నుంచి 25వ తేదీ వరకు (ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న వాటిని పరిశీలిస్తారు.
25 వరకు నామపత్రాల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుంది. 18 నుంచి 25వ తేదీ వరకు (ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరి తేదీ 29. మే 13న పోలింగ్. జూన్ 4న ఓట్ల లెక్కింపు. జూన్ 6 నాటికి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. జిల్లాలో ఒక ఎంపీ, 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ వ్యవహరించనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గ స్థానాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరుకు వై.మధుసూదనరెడ్డి (ఎస్డీసీ కేఆర్ఆర్సీ), నగరికి కె.వెంకటరెడ్డి (నగరి ఆర్డీవో), జీడీనెల్లూరుకు సి.వెంకటశివ (ఎస్డీసీ ఐవోసీఎల్), చిత్తూరుకు పి.శ్రీనివాసులు (జేసీ), పూతలపట్టుకు జి.చిన్నయ్య (చిత్తూరు ఆర్డీవో), పలమనేరుకు మనోజ్రెడ్డి (పలమనేరు ఆర్డీవో), కుప్పానికి జి.శ్రీనివాసులు (కుప్పం ఆర్డీవో)లను నియమించారు.
ఎన్నికల పరిశీలకుల నియామకం
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకుల్ని నియమించింది. వీరు బుధవారం నుంచి జిల్లాలో పర్యటిస్తారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ మంగళవారం తెలిపారు.
వివరాలివీ..
- చిత్తూరు పార్లమెంట్కు శంకర్ప్రసాద్ శర్మ (వ్యయ పరిశీలకులు)
- నగరి, జీడీనెల్లూరు నియోజకవర్గాలకు కైలాశ్ వాంఖడే (సాధారణ పరిశీలకులు)
- చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు సాధిక్అలం (సాధారణ పరిశీలకులు)
- పుంగనూరు, నగరి నియోజకవర్గాలకు శ్రీనివాస్ ఖన్నా (వ్యయ పరిశీలకులు)
- చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు రోహన్ ఠాకూర్ (వ్యయ పరిశీలకులు)
- నగరి, జీడీనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు అరవింద్.హెచ్.సాల్వే (శాంతిభద్రతల పరిశీలకులు).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల