ఊసరవెళ్లే నయమనిపింఛెను
అవ్వతాతలకు మనవడిగా.. ఒంటరి మహిళలకు, వితంతవులు, దివ్యాంగులకు అన్నగా.. తమ్ముడిగా చేనేత కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు పింఛన్ మూడు వేలకు పెంచుతామంటూ మాటిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు.
ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు సుమారు 5 లక్షలు
ఐదేళ్లలో 32 వేల మంది తొలగింపు
గూడూరు, న్యూస్టుడే
అవ్వతాతలకు మనవడిగా.. ఒంటరి మహిళలకు, వితంతవులు, దివ్యాంగులకు అన్నగా.. తమ్ముడిగా చేనేత కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు పింఛన్ మూడు వేలకు పెంచుతామంటూ మాటిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు. రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామంటూ మాట మార్చారు.
- ధికారంలోకి రాగానే రూ.3 వేలిస్తానని మాట తప్పిన జగన్
- యిదా పద్ధతుల్లో పెంపు
- దేళ్లలో రూ.1,652.70 కోట్లు ఎగవేత
ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నారు. వీరికి ఎన్నికల ముందే పెంచి ఇస్తామన్న జగన్ వాయిదాల పద్ధతిలో పెంచారు. పేదల ఆశలకు గండి కొట్టిన సీఎం కొత్త లబ్ధిదారులు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తోంది. 45 ఏళ్లకే పింఛన్ అన్న మాటకు వక్ర భాష్యం చెప్పారు. అర్హత ఉండీ దరఖాస్తు చేసుకున్న వారికి చుక్కలు చూపించారు. ఆరంచెల పేరిట కోత పెట్టి ముప్పుతిప్పలు పెట్టారు. అటు ఆధార్, ఇటు ఆస్తి పన్నులు, ఆదాయ పన్నులు, భూములు, రవాణా శాఖ వెబ్సైట్లు లింకు చేసి అర్హత లేకుండా చేశారు. ఇలా ఐదేళ్లలో వేల మందిని తొలగించిన జగన్ మళ్లీ ఏడాది ఆరంభంలో కొత్తగా ఇస్తున్నట్లు చెప్పి అడ్డదారులు తొక్కారు.
ఒక్క మాటకు అనేక అర్థాలు.. పెంచి పింఛన్లు ఇస్తామన్న జగన్ పెంచుతూ పోతామన్నట్లు ఎన్నికల తర్వాత కూని రాగం తీశారు. ఇలా నాలుగేళ్లు పెంచుకుంటే ఐదో ఏట మూడు వేలకు పెంచారు. ఒక్కో లబ్ధిదారుడు సుమారుగా తొలి రెండేళ్లు రూ.21 వెయ్యి నష్టపోయారు. ఇలా నెలకు రూ.750 లెక్కన 28 నెలలు పెంచలేదు. ఆ తర్వాత 2022లో 2500 చేయగా ఆ ఏడాది 12 నెలల నష్టం రూ.6 వేలు, 2023లో రూ.2750 చేయగా ఏడాది నష్టం రూ.3 వేలు కాగా ఇలా ఒక్కో లబ్ధిదారుడు రూ.30 వేలు నష్టపోయారు. ఇలా ఐదేళ్లలో 5 లక్షల మందికి సుమారు రూ.1600 కోట్లు ఎగనామం పెట్టారు.
ఆరంచెల పరిశీలన పేరుతో కోత..
ప్రభుత్వానికి ఉన్న అనేక మార్గాల ద్వారా లబ్ధిదారుల వివరాలు సరిచూసి ఏరివేశారు. పెంపుపై దృష్టి పెట్టని జగన్ సర్కార్ రెండన్నరేళ్లు ఏరివేతలు చేపట్టారు. భూములు ఎక్కువున్నట్లు, ఆధార్లో పుట్టినతేదీ పొరపాట్లు, 300 యూనిట్ల కరెంట్, రేషన్కార్డుల్లో తప్పులు, ఆస్తి ఎక్కువగా ఉండటం.. కార్లు, ఇతర వాహనాలు, ఆదాయపు పన్నులు చెల్లిస్తున్నట్లు వెరసి అనేక కుంటి సాకులు చూపించారు. ఈ ఐదేళ్లలో లక్షకు పైగా ఇలా ఏరివేతలు చేసిన జగన్ కొత్త పింఛన్కు ఏడాది ఆగాలని పరోక్షంగా వెల్లడించారు.
ఐదేళ్లుగా తిరుగుతున్నా
- నావూరు కృష్ణయ్య, నాయుడుపేట
మూర్చవ్యాధిగ్రస్థుడిగా.. బేల్దారి పనిచేస్తుంటా. గతంలో పింఛన్ వచ్చేది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు పోగొట్టుకుపోయింది. ఒంటరి కావడంతో సొంతూరు నుంచి నాయుడుపేట వచ్చేశా. ఇక్కడ ఆధార్ కార్డు తిరిగి తీసుకుని రేషన్కార్డుకి దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. పింఛన్కు వెళితే కార్డు లేదన్నారు. ఇలా అనేక పర్యాయాలు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా దిక్కు లేకుండా పోయింది.
300 యూనిట్లు వచ్చిందని ఆపేశారు
- కమలమ్మ, కాలేపల్లి, రామచంద్రాపురం మండలం
కరెంట్ బిల్లు 300 యూనిట్లు వచ్చిందని నాకు వస్తున్న పింఛన్ ఆపేశారు. వృద్ధుల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదు. ఇంట్లో రెండు వృద్ధాప్య పింఛన్లు వస్తున్న వారికీ రాష్ట్రవ్యాప్తంగా ఒకటి ఆపేశారు. నా పింఛన్ డబ్బుతో కుటుంబ పోషణకు ఉపయోగించుకునేవారం. ఇప్పుడు అప్పుచేసే పరిస్థితి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల