జగనన్నా.. ఉద్యోగులంటే అంత అలుసా ?
ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా, రాస్తారోకో చేసినా, విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆందోళన చేపడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అరెస్ట్లు చేయడం, ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వారు భయాందోళనలకు గురవుతున్నారు.
ఉద్యమాలు చేస్తే కేసులే
భయాందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు
న్యూస్టుడే, చిత్తూరు విద్య, కలెక్టరేట్, పూతలపట్టు
ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా, రాస్తారోకో చేసినా, విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆందోళన చేపడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అరెస్ట్లు చేయడం, ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వారు భయాందోళనలకు గురవుతున్నారు.. సకాలంలో వేతనాలు అందక, అప్పులు తీర్చలేక, ఈఎంఐలు కట్టలేక ఐదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు.. 2022 ఏప్రిల్లో విజయవాడలో పెద్దఎత్తున ధర్నా చేపట్టగా 65 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోజు నుంచి జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ కోర్టు వాయిదాలకు వెళ్లొస్తున్నారు.. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ఆందోళన చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉందని ఉద్యోగ, ఉపాధ్యాయులు వాపోతున్నారు.
మంత్రి హామీలకే దిక్కులేదు..
-గణేష్ గుల్లారి, మండల ప్రధాన కార్యదర్శి, పూతలపట్టు, ఎస్టీయూ
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మంత్రులు ఇచ్చిన హామీలు అమలుకాక పోవడం శోచనీయం. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తే పోలీసులతో అణచివేయించారు. ఉద్యోగులు.. ప్రభుత్వంపై అభద్రతా భావంలో ఉన్నారు. పిల్లల చదువుకు, వివాహాల కోసం దాచుకున్న సొమ్ము దారి మళ్లించడం బాధాకరం. ఉద్యోగుల్లో భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే విధానాలు మానుకోవాలి.
నోటీస్ ఇస్తే మరుసటిరోజే అరెస్టు..
-రెడ్డెప్ప నాయుడు, జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యదర్శి
సమస్యల పరిష్కారానికి ఆందోళన చేపట్టడానికి ముందుగా నోటీసు ఇస్తాం. ఆ మరుసటి రోజే పోలీసులు వచ్చి అక్రమంగా గృహనిర్బంధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నోటీస్ ఇస్తే సంబంధిత సంఘ నాయకులను పిలిచి చర్చించేవారు. ఇప్పుడా విధానమే లేదు. నియంతృత్వ ధోరణితో అణచివేసే పద్ధతి అవలంబిస్తున్నారు. ఎక్కడా ప్రజాస్వామ్యం లేదు.
అడుగడుగునా బెదిరింపులు..
-రాధాకృష్ణ, జిల్లా మీడియా కన్వీనర్, ఆపస్
సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతి అనుసరించినా ప్రయోజనం లేదు. సీపీఎస్ రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వకపోగా వారికి ఇష్టం వచ్చిన విధానాలు ఉద్యోగులపై రుద్దుతోంది. అణచివేత ధోరణితో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం