సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
వైకాపా అరాచక పాలనతో విసిగి వేశారిన ప్రజలకు ఎన్నికల రూపంలో ఇప్పుడు సరైన అవకాశం వచ్చిందని, అందరి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు.
చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్టుడే: వైకాపా అరాచక పాలనతో విసిగి వేశారిన ప్రజలకు ఎన్నికల రూపంలో ఇప్పుడు సరైన అవకాశం వచ్చిందని, అందరి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. లక్ష్మీనగర్ కాలనీలోని ఓంశక్తి ఆలయంలో పూజలు చేసి 11, 14, 15 వ డివిజన్ల పరిధిలోని జోగలకాలనీ, చెన్నమ్మగుడిపల్ల్లి, ఎన్.ఎన్.కండ్రిగ, ద్వారకాపురం, గోవిందపురం, బండపల్లి, ఎల్.బి.పురం, చెరువుముందరకండ్రిగ, గాజులపల్లి, కురపల్లి, తిమ్మసానిపల్లి, వై.ఎస్.కాలనీలో మంగళవారం ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, నాయకులతో కలిసిప్రచారం చేశారు. చెన్నమ్మగుడిపల్లి, చెరువుముందరవూరులో వైకాపాను వీడి 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. తిమ్మసానిపల్లిలో పలువురు పార్టీలో చేరారు. మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ మేయర్ కఠారి హేమలత, తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, కార్పొరేటర్ జయలక్ష్మి, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, తెదేపా నాయకులు శేషాద్రినాయుడు, నాగరాజునాయుడు, మధునాయుడు, మాజీ కార్పొరేటర్ భార్గవి, వెంకటేష్యాదవ్, రాము, కోడిబాబు, శివ పాల్గొన్నారు.
గుడిపాల: తెదేపా కూటమి అభ్యర్థి జగన్మోహన్ సతీమణి ప్రతిమ కుప్పిగానిపల్లె, 13.గొల్లపల్లె పంచాయతీలో ప్రచారం చేపట్టారు. గొల్లపల్లెలో వరి తూర్పార పడుతూ, కృష్ణజిమ్మాపురంలో వేరుసెనెగ కాయలు వలుస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. మాజీ జడ్పీటీసీ సుమతి, మాజీ ఎంపీపీ దీపశ్రీ పాల్గొన్నారు. నగరి: వైకాపా అరాచక పాలనతో అభివృద్ధిలో వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే చంద్రబాబు తపన పడుతున్నారని తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. ఏకాంబరకుప్పంలో ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐరాల: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేస్తున్న దాష్టీకానికి చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని కూటమి అభ్యర్థి మురళీమోహన్ తెలిపారు. గోవిందరెడ్డిపల్లె, నయనంపల్లె, ఐకే రెడ్డిపల్లె, గొల్లపల్లెలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. వైకాపాకు కంచుకోటైన గోవిందరెడ్డిపల్లెలో సుమారు 60 కుటుంబాలు తెదేపాలో చేరడం ఇందుకు నిదర్శనమన్నారు. ఆయా పార్టీల నాయకులు గిరిధర్బాబు, దేవాజీ, తులసీప్రసాద్, లత, మురళీ, పెరుమాళ్ సుబ్బారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వేణుగోపాల్, రాజేశ్రెడ్డి, రంజిత్రెడ్డి, లోకనాథరెడ్డి, రవి, వాసు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట