మానవత్వం మరిచి.. రహదారిపై వదిలేసి
మానవత్వం మరచిన తల్లి.. కన్నబిడ్డను అర్ధరాత్రి నడ్డిరోడ్డుపై వదిలేసింది. చీకట్లో బిక్కుబిక్కుమంటూ అడుగులు వేస్తున్న చిన్నారిని గుర్తించిన లారీ డ్రైవర్.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమెను పోలీసులకు అప్పగించారు.
చిన్నారిని పోలీసులకు అప్పగించిన లారీ చోదకుడు
భర్తతో గొడవపడి తల్లి నిర్వాకం
బైరెడ్డిపల్లె, న్యూస్టుడే: మానవత్వం మరచిన తల్లి.. కన్నబిడ్డను అర్ధరాత్రి నడ్డిరోడ్డుపై వదిలేసింది. చీకట్లో బిక్కుబిక్కుమంటూ అడుగులు వేస్తున్న చిన్నారిని గుర్తించిన లారీ డ్రైవర్.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమెను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గంగవరం మండలం పత్తికొండకు చెందిన శ్రీనివాసులు, కావేరిలది ప్రేమ వివాహం. వీరిని ఇరు కుటుంబాలు చేరదీయలేదు. ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన వీరికి నందిత (2) సంతానం. ఏడాది కిందట పలమనేరు వచ్చేశారు. శ్రీనివాసులు ట్రాక్టర్ పనిచేస్తున్నారు. అతనికి మద్యం వ్యసనం ఉండటంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున బైరెడ్డిపల్లె పోలీస్స్టేషన్కు సమీపంలోని బాటగంగమ్మ ఆలయం వద్ద ప్రధాన రహదారిపై రెండేళ్ల చిన్నారి తిరుగుతూ కనిపించడంతో ఓ లారీ డ్రైవర్ ఆమెను చేరదీసి.. సమీపంలో వెతికారు. ఎవరూ కనిపించకపోవడంతో పోలీసులకు అప్పగించారు. మంగళవారం పాప చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు వైరల్ చేశారు. చిన్నారి తల్లిదండ్రులు సాయంత్రం గంటలకు బైరెడ్డిపల్లె పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. ఎస్ఐ కృష్ణయ్య విచారణలో కావేరీ పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు గుర్తించారు. కౌన్సెలింగ్ కోసం గంగవరం సీఐ కృష్ణమోహన్ వద్ద కౌన్సిలింగ్ నిర్వహించి అపగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల