logo

ఈడిగ కులస్థులకు సీఎం జగన్‌ అన్యాయం

తెదేపా కూటమి విజయమే లక్ష్యంగా బీసీలు పని చేయాలని  తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్‌ పిలుపునిచ్చారు.

Published : 17 Apr 2024 03:24 IST

చిత్తూరు(జిల్లా పంచాయతీ): తెదేపా కూటమి విజయమే లక్ష్యంగా బీసీలు పని చేయాలని  తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్‌ పిలుపునిచ్చారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఈడిగ సామాజికవర్గం నాయకులతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో తెదేపాను గెలిపించాలన్నారు. తెదేపా ఈడిగ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అమర్‌నాథగౌడ్‌ మాట్లాడుతూ ఈడిగ కులస్థులకు సీఎం జగన్‌ అన్యాయం చేశారన్నారు.  నాయకులు బుసనాగరాజ్‌గౌడ్‌, శ్రీధర్‌యాదవ్‌, మోహన్‌రాజ్‌, విజయకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు