జగనాసుర రాజ్యం.. అరాచకాలకు ఆజ్యం
వైకాపా అధికారంలోకి వచ్చాక అచ్చంగా ఇలా కాకపోయినా కాస్త అటూఇటూగా రాష్ట్రంలో, జిల్లాలో ఇటువంటి పరిణామాలే జరుగుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో అక్రమాలు, వేధింపులు, కక్షలు
ప్రజలకు ప్రశాంతత కరవు
నిత్యం బాదుడే.. బాధితుడు సామాన్యుడే
ఈనాడు, చిత్తూరు
‘ఒరేయ్ బావమరిది నా రాజ్యం రామరాజ్యం.. ఇక్కడ హత్యలు, రౌడీయిజం ఉండవు. మాట వినకుంటే కదరా హత్య చేయాలి. ఎవరైనా ఇవ్వనంటే కదరా రౌడీయిజం చేయాలి’
- ఓ సినిమాలో పక్కనే ఉన్న వ్యక్తితో విలన్ చెప్పేమాటలివి.
వైకాపా అధికారంలోకి వచ్చాక అచ్చంగా ఇలా కాకపోయినా కాస్త అటూఇటూగా రాష్ట్రంలో, జిల్లాలో ఇటువంటి పరిణామాలే జరుగుతున్నాయి. 2019 ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్ ప్రతి ప్రచార సభలో రామరాజ్యం తెస్తానని.. ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూస్తానని ఊదరగొట్టారు. జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇవే సుభాషితాలు వల్లించారు. తీరా అయిదేళ్ల పాలనను ఓసారి వెనక్కు తిరిగి చూసుకుంటే రామరాజ్యాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో రావణకాష్టం రగులుతోంది. జగన్ జగనాసురుడిలా మారిపోయారు. జిల్లాలో ఆయన పార్టీ గణం అరాచకాలకు ఆజ్యం పోసింది. నేడు శ్రీరామనవమి సందర్భంగా జగన్, ఆయన పార్టీ నేతలు చెప్పిన మాటలు, ఇప్పుడున్న పరిస్థితులను ఒక్కసారి అవలోకనం చేసుకుందాం.
కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడనని చెప్పి
వనవాసంలో ఉన్న రాముడిని వెతు క్కుంటూ భరతుడు అడవికి వెళ్తాడు. రాజ్యంలో అసమానతలు ఉండకూడదని హితబోధ చేస్తాడు రాముడు. భరతుడు అలాగే రాజ్యమేలుతాడు. సీఎం జగన్ సైతం గత ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పాలన సాగిస్తానని వాగ్దానం చేశాడు. ముఖ్య మంత్రి పీఠం ఎక్కాక వాటిని మరిచి పోయారు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆవులపల్లె ప్రాంతంలోనే రిజర్వాయర్ నిర్మించడానికి ప్రధానంగా ఒక్క కారణమే ఉంది. ఓ సామాజికవర్గం ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వారు ప్రతిసారీ తనకు ఓటేయడం లేదన్నది స్థానిక ఎమ్మెల్యే భావన. ఈ నేపథ్యంలో అక్కడ జలా శయం కడితే వారంతా నిర్వాసితులై చెట్టుకొకరు పుట్టకొకరు అన్నవిధంగా వెళతారనే పనులకు శ్రీకారం చుట్టారు. పదవులు, అధికారులు, పోలీసుల్లో సీఎం జగన్ సామాజిక వర్గం వారినే నియమించుకున్నారు.
పన్నుల భారం ఉండదని హామీ ఇచ్చి
జనాలపై భరించలేనంతగా పన్నులు వేయకూడదని భరతుడికి రాముడు ఉపదేశించాడు. ఎన్నికలకు ముందు జగన్ అప్పటి అధికార తెలుగుదేశాన్ని పన్నుల విషయమై తూర్పారబట్టారు. తీరా సీఎం అయ్యాక ఆస్తి, చెత్త పన్ను, విద్యుత్తు, బస్సు, ఇంధన, నిత్యావసరాలతో మోత మోగించారు. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నరేళ్లలో విద్యుత్తు బిల్లుల భారమే అదనంగా రూ.వెయ్యి కోట్లు పడింది.
బీళ్లుగా పొలాలు
అధికారంలోకొస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన జగన్ భిన్నంగా వ్యవహరించారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పడకేశాయి. 58 నెలల్లో ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు.
శాంతి భద్రతలు గాలికి
శాంతి భద్రతలు కరవైన చోట జనం ప్రభువులను గౌరవించరని భరతుడికి రాముడు తెలిపాడు. రాష్ట్రంలో జగన్ శాంతి భద్రతలను గాలికొదిలేశారు. సామాన్యులు, ప్రతిపక్ష, సొంత పార్టీలోని అసమ్మతి నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. శాంతిపురం మండలం మొరసనపల్లెలో స్థానిక సర్పంచి భార్య నీలా.. అధికార పార్టీ నాయకుడి భూ ఆక్రమణను వ్యతిరేకించినందుకు సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ వ్యక్తులే అనుచితంగా పోస్టులు పెట్టి క్షోభ పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..