బస్టాండా.. అదెక్కడ..?
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు.
నియోజకవర్గ కేంద్రంలో ప్రజల ఇక్కట్లు
తారురోడ్డుపైనే బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు
గంగాధరనెల్లూరు: నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. మండలంతో పాటు చిత్తూరు గ్రామీణ, పాలసముద్రం, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పెనుమూరు మండలపరిధి గ్రామాల ప్రజలు వందలాదిమంది ఇక్కడ బస్సుల కోసం వేచివుంటారు. వీరికి బస్టాండు, బస్షెల్టరు లాంటివి లేకపోవడం వల్ల ఎండలో, వానలో అవస్థలు పడుతూ గంటల తరబడి వేచి ఉంటున్నారు. చాలాదూరం వరకు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఉండటం వల్ల తారు మార్గంపైనే బస్సుల కోసం వేచి వుండాల్సిన దుస్థితి. ఎండకు, వానకు రక్షణ కోసం దుకాణాల ముందు వేచిఉంటే వ్యాపారాలకు అడ్డుగా ఉంటారని దుకాణదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విధి లేక తారురోడ్డు పైనే వేచిఉండి అక్కడే బస్సులు ఆపి ఎక్కడం సాధారణమైంది. తద్వారా తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక చంటిపిల్లలు, వృద్ధులతో ప్రయాణాలు చేసేవారు పడే బాధలు వర్ణనాతీతం. నీడ సౌకర్యం లేకపోవడం సహా తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలాదూరం వరకు తారు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో మలమూత్రాల విసర్జనకు మహిళలు, వృద్ధులు పడే బాధలు చెప్పలేం. అయిదేళ్లుగా బస్టాండు, బస్షెల్టరు నిర్మించాలని పాలకులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
మరుగుదొడ్లు నిర్మించాలి..
చంటి పిల్లలు, వృద్ధులతో ప్రయాణించే సమయంలో గంటల తరబడి ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ అవస్థలు పడుతున్నాం. ముఖ్యంగా మరుగుదొడ్లు లేకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో మాలమూత్ర విసర్జనకు తీవ్ర అవస్థలు పడుతున్నాం. దూరప్రాంతాలకు వెళ్లి వచ్చే లోగా ఎక్కాల్సిన బస్సులు వచ్చి వెళ్లిపోవడం వల్ల ప్రయాణం చేయలేకపోతున్నాం. అన్ని వసతులతో కూడిన బస్టాండు నిర్మించాలి.
కుమారి, బంగారెడ్డిపల్లె
రోడ్డుప్రమాదాలు నివారించాలి..
బస్టాండు, బస్షెల్టరు లేకపోవడంతో విధి లేక తారురోడ్డు పైనే బస్సుల కోసం వేచిఉండి ఎక్కుతున్నాం. దీంతో తరచూ ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ వందలాదిమంది వేచిఉండటం చూసైనా అన్ని వసతులతో కూడిన బస్టాండు లేక బస్షెల్టరు నిర్మించాలి.
షణ్ముగం, కడపగుంట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ