‘అరాచక పాలనకు అంతం పలకాలి’
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంలో సీకేబాబు, ఆయన తనయుడు సాయి కృష్ణారెడ్డి
చిత్తూరు(జిల్లా పంచాయతీ): ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మంగళవారం నగరంలోని 8వ డివిజన్ పరిధిలోని వెంగళరావుకాలనీ, శ్రీనివాసనగర్, రీడ్స్పేట, కుమార్ నగర్ కాలనీల్లో మాజీ ఎమ్మెల్యే సీకేబాబు, ఆయన తనయుడు సీకే సాయికృష్ణారెడ్డి ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా గురజాల జగన్మోహన్ను, ఎంపీగా దగ్గుమళ్ల ప్రసాదరావును గెలిపించాలని కోరారు. 27వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ సతీమణి ప్రతిమ తెలుగు మహిళలతో కలిసి ప్రచారం చేశారు.నాయకులు త్యాగరాజన్, శ్రీరాములు, వైవీ రాజేశ్వరి, ప్రియాంక, జ్యోతిరాజ్, అనిల్, డేవిడ్, మురళి, సురేష్ పాల్గొన్నారు. చిత్తూరు (సంతపేట): మైనార్టీల సంక్షేమానికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉందని తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి అభ్యర్థి జగన్మోహన్ అన్నారు. స్థానిక భాజపా కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనారిటీ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగదీశ్వరనాయుడు, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరచౌదరి, షంషీర్, రెడ్డిమస్తాన్ పాల్గొన్నారు. పుత్తూరు: తెదేపా గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. 12 వార్డులోని చిన్నబ్బనాయుడు కండ్రిగ, కుందిమాకులగుంట తదితర గ్రామాల్లో పర్యటించారు. పట్టణ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవరత్నం, ధనపాల్, మాజీ కౌన్సిలర్ నాగయ్య, తెదేపా నాయకులు బాబునాయుడు, రమేష్నాయుడు, రవి పాల్గొన్నారు. వడమాలపేట: అభ్యర్థి భానుప్రకాష్ గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ధనంజేయులునాయుడు అన్నారు. సీతారామపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. జానా వెంకటయ్య, హేమావతి, లక్ష్మీప్రసన్న, శోభనాద్రి యాదవ్, భాస్కర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే