నమ్ముకుంటే.. మోసపోయాం
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు.
గాల్లో దీపంలా భవిష్యత్తు
జగన్ మోసంపై గోపాలమిత్రల మండిపాటు
పశువులకు వైద్యం చేస్తున్న గోపాలమిత్రలు (పాత చిత్రం)
న్యూస్టుడే, పెనుమూరు, పుత్తూరు : రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు.. దీంతో గోపాలమిత్రలు ఎంతో సంబరపడ్డారు.. తమ జీవితాలకు వెలుగు వస్తుందని ఆశపడ్డారు.. చివరకు వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి.. పాదయాత్ర చేసి ఏడేళ్లు, పదవిలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు వారికి ఇచ్చిన హామీలు పట్టించుకున్న పాపాన పోలేదు.. ఉద్యోగ భద్రత అటుంచితే తమను ఉంచుతారో లేదో అన్న అనుమానం వారిలో కలుగుతోంది.
చంద్రబాబు పథకమనే నిర్లక్ష్యం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు సకాలంలో వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గోపాలమిత్ర పథకాన్ని తెచ్చారు. గత ఎన్నికలకు ముందు రూ.3 వేలు ఇస్తున్న వేతనాన్ని.. చంద్రబాబు రూ.6,500కు పెంచారు. ఆ సమయంలో గోపాలమిత్రల సంఘం నాయకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే వీరికి నేడు సీఎం జగన్ అన్యాయం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగ భద్రత ఏదీ..?
గత ఇరవై ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పాడి సంతతి పెపొందించేందుకు ఎంతో కోసం కష్టపడి పనిచేస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నేరవేరలేదు. కనీసం వేతనాలు పెంచుతారని ఆశిస్తే అందులోనూ నిరాశే ఎదురైంది.
చంద్రబాబు పుత్తూరు
ఉపాధికి గండికోట్టారు
తమకు కనీసం వేతనం కింద రూ.15 వేలు ఇవ్వాలి. తాము అధికారంలోకి వస్తే గోపాలమిత్రలను క్రమబద్ధీకరి స్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి ఐదేళ్లు పూర్తయి మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఇప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తమకు 20 ఏళ్లు అనుభవం ఉన్నా.. తమను కాదని సచివాలయాల్లో డిప్లొమో చేసిన వారిని వీహెచ్ఏలుగా నియమించడంతో తమ ఉపాధికి గండి పడింది. దీంతో మా కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడింది.
జయరామిరెడ్డి, తిమ్మాపురం
పట్టించుకోకపోవడం దారుణం..
పాదయాత్రలో ఓట్లకోసం మాట ఇచ్చి తరవాత తమ సమస్యలు పట్టించుకోలేదు. కనీసం మా విజ్ఞప్తిని పరిశీలించలేదు. మా నాయకులను కలిసేందుకు వెళ్లినా వారు సైతం సమయం ఇవ్వకుండా దాటవేశారు. వేతనం పెంచడం మాట అటుంచితే ఉద్యోగ భద్రతపై ఆశలు ఉండటం లేదు.
గోపాలమిత్రలు, పెనుమూరు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం