గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా..
నమ్మించి మోసగించిన వైనం
ఐదేళ్లుగా పత్తాలేని బకాయిలు
- మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా..
- ఇదీ ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సందర్భంగా నాడు జగన్ చేసిన ఆర్భాటపు ప్రకటనలు.
- ‘అధికారంలోకి వచ్చాక గోపాలమిత్రల గోడు పట్టించుకోకపోగా వారిని నట్టేట ముంచేశారు. ఏకంగా వారిని ఆయా విధుల నుంచి తప్పించి ఆర్బీకేలు, పశువైద్యశాలలకు పరిమితం చేశారు.’
- ఇదీ ప్రస్తుతం గోపాలమిత్రల దయనీయ స్థితి
చిత్తూరు (వ్యవసాయం), న్యూస్టుడే: గ్రామీణ ప్రాంతాల్లో గోపాలమిత్రలు 23 ఏళ్లుగా పాడిరైతుల ఇంటికే వెళ్లి సేవలందిస్తున్నారు. తెదేపా ప్రభుత్వం 2000లో తెచ్చిన ఈ వ్యవస్థ పాడి రైతుల మన్నన పొందింది. వీరికి రూ.3,500 ఉన్న గౌరవ వేతనాన్ని.. చంద్రబాబు రూ.6,500కు పెంచారు. దీన్ని రూ.15 వేలు చేసి.. వెన్నంటి ఉంటానని అధికారంలోకి వచ్చిన జగన్ ఆర్బీకే వ్యవస్థను తెచ్చి తమను వెన్నుపోటు పొడిచారనిజ్ఞ వాపోతున్నారు.
గ్రామాల్లో పశువులకు జబ్బు చేస్తే వైద్యులు వచ్చేలోగా గోపాలమిత్రలు ప్రథమ చికిత్స చేసేవారు. ఎదకు వచ్చిన వాటికి ఇంజక్షన్లతో పాటు దూడల పెంపకాన్ని ప్రోత్సహించి పశుసంపద అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వైద్యులు సూచించిన ప్రతి పనీ నిర్వహిస్తున్నారు. తమను క్రమబద్ధీకరించకపోగా ఆర్బీకేల్లో అదనపు విధులు అప్పగించి పనిభారం పెంచారని, వేతనాలు మాత్రం గతంలో మాదిరే ఉన్నాయని, సమస్యలు పరిష్కరించాలని ఎవరిని అడిగినా స్పందించడం లేదని వాపోతున్నారు. తాజాగా ఫలం సూదులు భద్రపరిచే కంటైనర్ బాక్స్లు వెనక్కి ఇచ్చేయాలని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు ఆదేశించడాన్ని వారు తప్పుబడుతున్నారు.
2019 నుంచి నిలిచిన బకాయిలు..
ఎదకు వచ్చిన పశువులకు ఇంజక్షన్లు చేసి రైతు వద్ద ఒక్కోదానికి రూ.40 తీసుకుంటారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి పంపినా మళ్లీ గోపాలమిత్రలకే చెల్లిస్తుంది. వైకాపా వచ్చాక వీటిని నిలిపేసింది. ఒక్కొక్కరికి రూ.వేలల్లో సెమెన్ కొనుగోలు డబ్బులు రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది.
హామీలు విస్మరించి మోసగించారు
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 2021లో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ విస్మరించి తమను జగన్ నమ్మించి మోసం చేశారు. మా కుటుంబాలు బాగుపడతాయని ఎంతో ఆశతో ఉన్నాం. ఐదేళ్లు పూర్తయినా మా గోడు పట్టించుకోకుండా వీధి పాల్జేశారు.
వేణుగోపాలరాజు, గోపాలమిత్ర, బాలగంగనపల్లి, ఎస్ఆర్పురం మండలం
పశువైద్యసేవలు దూరమై..
జగన్ ప్రభుత్వం గోపాలమిత్రలను మోసగించింది. ఎల్లప్పుడూ పాడిరైతులకు అందుబాటులో ఉండి మెరుగైన పశువైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం వీరిని విస్మరించడంతో పశువైద్యసేవలు దూరం కానున్నాయి.
హరికృష్ణ, లక్ష్మయ్యకండ్రిగ, పాడిరైతు, యాదమరి మండలం
తొలగిస్తామని భయపెడుతున్నారు..
మాకు ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని 2021లో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టినా జగన్ పట్టించుకోలేదు. విధుల నుంచి తొలగిస్తామని మమ్మల్ని భయపెడుతున్నారు. చాలీచాలని వేతనాలతోపాటు మూడు నెలలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరమైంది.
తులసీపతి, గోపాలమిత్ర, తవణంపల్లె మండలం
పట్టించుకోకపోవడం శోచనీయం..
సకాలంలో విస్తృత సేవలందిస్తున్న గోపాలమిత్రల సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయం. ఏళ్ల తరబడి పశువైద్యసేవలు అందిస్తూ పాడిరైతుల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి తీరా అధికారం లోకి వచ్చాక విస్మరించడం భావ్యం కాదు. వీరి సేవలు దూరమైతే పాడిరైతులకు తీవ్ర నష్టం.
వెంకటేష్రాజు, పాడిరైతు, బాలగంగనపల్లి, ఎస్సార్పురం మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్