ఆడపడుచు ఆరాధనకు వేళాయే..
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర..
21, 22 తేదీల్లో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర
న్యూస్టుడే, చిత్తూరు(క్రీడలు)
నైవేద్యంగా అంబలి సమర్పిస్తున్న భక్తులు(పాత చిత్రం)
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర.. ప్రజల ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబించే ఊరి పండుగ ఇది.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో గత వారం జరగాల్సిన జాతరను.. ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు.. అమ్మకు మొక్కులు తీర్చుకుంటే వర్షాలు సమృద్ధిగా కురిసి కరవు కాటకాలు దూరమవుతాయని, పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యం ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.. తేదీ మార్పుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.. ఈ అపరాధాన్ని మన్నించి.. ఊరిని కాపాడాలంటూ గంగమ్మ తల్లిని వేడుకునేందుకు ఊరుఊరంతా ఎదురుచూస్తోంది.
కడుపు నిండా భుజిస్తారు అమ్మ..!
గంగమ్మకు నైవేద్యాల్లో పట్టింపు ఉండదు. భక్తులు ఏమిచ్చినా ప్రేమతో స్వీకరిస్తారు. తొలి నైవేద్యంగా భక్తులు సమర్పించే రాగి అంబలి అమ్మకెంతో ప్రీతికరం. అమ్మ ఆకలి తీరేవరకు లేదనకుండా ఏరులా పారేలా అంబలి సమర్పిస్తారు భక్తులు. సాయంత్రం ఉప్పుచేప పులుసు, ఉడికించిన కోడిగుడ్లు, వంకాయ కూర, మునగాకు, కుడుములు.. ఇలా షడ్రుచులతో కూడిన వంటకాల్ని మహాకుంభ నైవేద్యంగా సమర్పిస్తారు.
ప్రత్యేకం.. ఓంశక్తి భక్తుల విన్యాసం
నిమజ్జన వేడుకల రోజున ఓంశక్తి భక్తుల సాహసోపేత విన్యాసం ప్రత్యేక ఆకర్షణ. నోటిపై, నాలుకపై, వీపుభాగం, కాళ్లకు ఇనుప కొక్కీలు తగిలించుకుని ఓంశక్తి భక్తులు ప్రదర్శించే విన్యాసం గగుర్పాటుకు గురిచేస్తుంది. జాతరకు ముందు దీక్ష చేపట్టే భక్తులు.. జాతర రోజున మొక్కులు తీర్చుకుంటారు. ఈ విన్యాసాల వీక్షణకు వివిధ ప్రాంతాల నుంచి అశేషసంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
నేపథ్యమిది.. నడివీధే ఆలయం
శతాబ్దాలకు పూర్వం ప్రాణాంతక వ్యాధులతో మరణాలు, తీవ్రమైన దుర్భిక్షంతో కకావికలమైన చిత్తూరును మళ్లీ నెలబెట్టింది గంగమ్మ అని పెద్దలు చెబుతారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన చిత్తూరులో జరిగే అతిపెద్ద పండుగ గంగమ్మ జాతర. గంగమ్మకు చిత్తూరులో ప్రత్యేకంగా ఆలయం లేదు. శతాబ్దాలకు పూర్వం నుంచీ చిత్తూరు నడివీధి (బజారువీధి)లో రాతిశిలను గంగమ్మ రూపంగా భావించి పూజలు చేసేవారు. ఆరంభంలో జాతర ఒక్కరోజే నిర్వహించారు. అమ్మవారి ప్రాభవం దశదిశలా వ్యాపించడం, భక్తుల రద్దీ అధికం కావడంతో ఉత్సవాలుర రెండ్రోజులపాటు కొనసాగిస్తున్నారు. కాలక్రమేణా గంగమ్మ రూపాన్ని రూపొందించి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
అమ్మవారి అలంకరణ ఇలా..
కుమ్మర కులస్తులు తెచ్చిన బంకమట్టికి, పసుపు కుంకుమ కలిపి గంగమ్మ ప్రతిమను రూపొందించి సింహ వాహనంపై అధిష్ఠింపజేస్తారు. దర్జీ కుటుంబం అమ్మవారికి దుస్తులు, విశ్వబ్రాహ్మణ కులస్తులు మంగళసూత్రాన్ని, రజక కులస్తులు తొలి నైవేద్యంగా రాగి అంబలి సమర్పిస్తారు. బలిజ కులస్తులు తొలి పూలమాల వేస్తారు. అమ్మవారిని ఉత్సాహపరిచేందుకు డప్పు కళాకారులు వాయిద్యాలు మోగిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
చిత్తూరు నడివీధిలో ఈ నెల 21, 22 తేదీల్లో జాతర జరగనుంది. మంగళవారం వేకువజామున గంగమ్మకు తొలిపూజ జరగనుంది. అమ్మవారికి ఉదయం అంబలి, సాయంత్రం మహా కుంభాన్ని నైవేద్యంగా సమర్పించనున్నారు. బుధవారం సాయంత్రం నిమజ్జన వేడుకలు ప్రారంభమవుతాయి. ఇలా గంగజాతరకు సర్వం సిద్ధమైంది. నగరంలో ఏర్పాట్లను నిర్వహకులు, అధికారులు పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం