ఆడపడుచు ఆరాధనకు వేళాయే..
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర..
21, 22 తేదీల్లో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర
న్యూస్టుడే, చిత్తూరు(క్రీడలు)
నైవేద్యంగా అంబలి సమర్పిస్తున్న భక్తులు(పాత చిత్రం)
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర.. ప్రజల ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబించే ఊరి పండుగ ఇది.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో గత వారం జరగాల్సిన జాతరను.. ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు.. అమ్మకు మొక్కులు తీర్చుకుంటే వర్షాలు సమృద్ధిగా కురిసి కరవు కాటకాలు దూరమవుతాయని, పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యం ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.. తేదీ మార్పుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.. ఈ అపరాధాన్ని మన్నించి.. ఊరిని కాపాడాలంటూ గంగమ్మ తల్లిని వేడుకునేందుకు ఊరుఊరంతా ఎదురుచూస్తోంది.
కడుపు నిండా భుజిస్తారు అమ్మ..!
గంగమ్మకు నైవేద్యాల్లో పట్టింపు ఉండదు. భక్తులు ఏమిచ్చినా ప్రేమతో స్వీకరిస్తారు. తొలి నైవేద్యంగా భక్తులు సమర్పించే రాగి అంబలి అమ్మకెంతో ప్రీతికరం. అమ్మ ఆకలి తీరేవరకు లేదనకుండా ఏరులా పారేలా అంబలి సమర్పిస్తారు భక్తులు. సాయంత్రం ఉప్పుచేప పులుసు, ఉడికించిన కోడిగుడ్లు, వంకాయ కూర, మునగాకు, కుడుములు.. ఇలా షడ్రుచులతో కూడిన వంటకాల్ని మహాకుంభ నైవేద్యంగా సమర్పిస్తారు.
ప్రత్యేకం.. ఓంశక్తి భక్తుల విన్యాసం
నిమజ్జన వేడుకల రోజున ఓంశక్తి భక్తుల సాహసోపేత విన్యాసం ప్రత్యేక ఆకర్షణ. నోటిపై, నాలుకపై, వీపుభాగం, కాళ్లకు ఇనుప కొక్కీలు తగిలించుకుని ఓంశక్తి భక్తులు ప్రదర్శించే విన్యాసం గగుర్పాటుకు గురిచేస్తుంది. జాతరకు ముందు దీక్ష చేపట్టే భక్తులు.. జాతర రోజున మొక్కులు తీర్చుకుంటారు. ఈ విన్యాసాల వీక్షణకు వివిధ ప్రాంతాల నుంచి అశేషసంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
నేపథ్యమిది.. నడివీధే ఆలయం
శతాబ్దాలకు పూర్వం ప్రాణాంతక వ్యాధులతో మరణాలు, తీవ్రమైన దుర్భిక్షంతో కకావికలమైన చిత్తూరును మళ్లీ నెలబెట్టింది గంగమ్మ అని పెద్దలు చెబుతారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన చిత్తూరులో జరిగే అతిపెద్ద పండుగ గంగమ్మ జాతర. గంగమ్మకు చిత్తూరులో ప్రత్యేకంగా ఆలయం లేదు. శతాబ్దాలకు పూర్వం నుంచీ చిత్తూరు నడివీధి (బజారువీధి)లో రాతిశిలను గంగమ్మ రూపంగా భావించి పూజలు చేసేవారు. ఆరంభంలో జాతర ఒక్కరోజే నిర్వహించారు. అమ్మవారి ప్రాభవం దశదిశలా వ్యాపించడం, భక్తుల రద్దీ అధికం కావడంతో ఉత్సవాలుర రెండ్రోజులపాటు కొనసాగిస్తున్నారు. కాలక్రమేణా గంగమ్మ రూపాన్ని రూపొందించి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
అమ్మవారి అలంకరణ ఇలా..
కుమ్మర కులస్తులు తెచ్చిన బంకమట్టికి, పసుపు కుంకుమ కలిపి గంగమ్మ ప్రతిమను రూపొందించి సింహ వాహనంపై అధిష్ఠింపజేస్తారు. దర్జీ కుటుంబం అమ్మవారికి దుస్తులు, విశ్వబ్రాహ్మణ కులస్తులు మంగళసూత్రాన్ని, రజక కులస్తులు తొలి నైవేద్యంగా రాగి అంబలి సమర్పిస్తారు. బలిజ కులస్తులు తొలి పూలమాల వేస్తారు. అమ్మవారిని ఉత్సాహపరిచేందుకు డప్పు కళాకారులు వాయిద్యాలు మోగిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
చిత్తూరు నడివీధిలో ఈ నెల 21, 22 తేదీల్లో జాతర జరగనుంది. మంగళవారం వేకువజామున గంగమ్మకు తొలిపూజ జరగనుంది. అమ్మవారికి ఉదయం అంబలి, సాయంత్రం మహా కుంభాన్ని నైవేద్యంగా సమర్పించనున్నారు. బుధవారం సాయంత్రం నిమజ్జన వేడుకలు ప్రారంభమవుతాయి. ఇలా గంగజాతరకు సర్వం సిద్ధమైంది. నగరంలో ఏర్పాట్లను నిర్వహకులు, అధికారులు పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్రుల ముసుగులో వైకాపా ఏజెంట్లు
[ 03-06-2024]
ఎన్నికల రోజున అల్లర్లు సృష్టించిన వైకాపా నాయకులు.. ఓట్ల లెక్కింపు రోజూ ఇదే పంథా ఎంచుకుంటారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.. -
మాట వినకుంటే తాట తీయడమే..!
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపును పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పోలింగ్ మరుసటి రోజు స్ట్రాంగ్ రూమ్ వద్ద తెదేపా అభ్యర్థిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎస్పీ సహా ఎస్బీ డీఎస్పీ, ఇద్దరు సీఐలపై వేటువేసిన నేపథ్యంలో ఇంకా అధికార పక్షపాతం చూపిస్తే ఉద్యోగాలు పోతాయనే భయం పోలీసుల్లో కొంత మేరకు మార్పు తెచ్చింది. -
లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన జూన్ నాలుగో తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
విస్తరణకు నోచుకోని.. ఏపీ ఫైబర్ నెట్
[ 03-06-2024]
రాష్ట్రంలో ఏపీ ఫైబర్ నెట్ మూలకు చేరింది. ప్రతి ఇంటికి ఇవ్వాలని గత ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ను ఏర్పాటుచేసింది. -
నిర్ణయించేది ఉద్యోగులే..!
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు రానే వచ్చేసింది.. అభ్యర్థుల్లో ఆందోళన, ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. -
భద్రతను.. మాయం చేశారు
[ 03-06-2024]
జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఏర్పాటు చేసిన రక్షణ కవచాలు(ఇనుప రైలింగ్) అదృశ్యమయ్యాయి. -
టీసీ ఇచ్చేందుకు పేచీ
[ 03-06-2024]
తాము చదివిన పాఠశాలల్లో టీసీలు తీసుకోవాలనుకుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముడుపులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. -
దివ్యాంగులని దిగులొద్దు...
[ 03-06-2024]
దివ్యాంగులంతా బడిబాట పట్టేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.. చదువుకు దూరంగా ఉన్న ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గుర్తించేందుకు సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు.. -
లెక్కింపులో అప్రమత్తంగా వ్యవహరించాలి: ఎస్పీ
[ 03-06-2024]
చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ మణికంఠ ఇతర అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు.