‘అధికార’ ఒప్పందం.. అడ్డగోలు నియామకం
రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఒప్పంద ఉద్యోగుల అతిచేష్టలు పరాకాష్ఠకు చేరుతున్నాయి.
చేరగానే ఉద్యోగుల అతిచేష్టలు
శ్రీకాళహస్తి, న్యూస్టుడే: రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఒప్పంద ఉద్యోగుల అతిచేష్టలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. దీంతో ఆలయ ప్రతిష్ఠకు విఘాతం కలుగుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు అనధికారిక దళారులుగా ఉంటూ వచ్చిన వాళ్లల్లో చాలా మంది ప్రస్తుతం ఒప్పంద ఉద్యోగులుగా అవతారమెత్తడం పట్ల విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి అన్నీ అడ్డగోలు నియామకాలే. ఇబ్బడిముబ్బడిగా ఒప్పంద పద్ధతిలో నియామకాలు చేపట్టడంపై విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కార్యాలయం, ట్రస్టుబోర్డు సిఫార్సులతో ఇష్టానుసారంగా నియమిస్తున్నారు. ఇందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల అండదండలు ఉండటంతో అడ్డూ అదుపు లేకుండా పోయింది.
పరిశీలించకుండానే నియామకాలు
ఉద్యోగుల పేర్ల ప్రస్తావన, నేరారోపణ పరిశీలించకుండానే ఒప్పంద ఉద్యోగులుగా నియామకపత్రాలు ఇచ్చేస్తున్నారు. పోలీస్ కేసులున్న వాళ్లను ఒప్పంద ఉద్యోగులుగా యథేచ్ఛగా నియమిస్తున్నారు. ఏళ్ల తరబడి ముక్కంటి ఆలయంలో ఉచిత సేవకులుగా ఉంటూ వచ్చిన వాళ్లందరూ ఇప్పటికీ అలాగే ఉండిపోయారు. నిన్నకాక మొన్న వచ్చిన వారు అధికార పార్టీ నేతల అండదండలతో ఒప్పంద ఉద్యోగులుగా చేరిపోయారు. మూడు నెలల వ్యవధిలో జరిగిన నియామకాలను పరిశీలిస్తే
- ఏళ్ల తరబడి గొడుగులు, సురిటీలు మోస్తూ వస్తున్న 18 మంది ఉచిత సేవకులకు పొరుగు ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని చెప్పి అధికార పార్టీకి చెందిన ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు.ః హుండీలో దొంగతనం చేస్తూ పట్టుబడిన ఉద్యోగికి సైతం రవాణా విభాగంలో అవకాశం కల్పించారు.
- అటెండర్ స్థాయిలో అయిదుగురికి అవకాశం ఇస్తూ రెండు దఫాలు పది మందిని నియమించారు.
- ముగ్గురిని కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించారు.ః పది మంది అర్చకులకు అవకాశం కల్పించారు.ః ముగ్గురిని ట్రాన్స్ఫోర్టు విభాగంలో ఉద్యోగులుగా నియమించారు.ః ఇవే కాకుండా రాహు, కేతు మండపాల్లోనూ ఒప్పంద ఉద్యోగులు పది మందికి పైగా ఉండటం గమనార్హం.
ఆరోపణలు వెల్లువెత్తుతున్నా..
నెల రోజుల క్రితం విధుల్లో చేరిన ఒప్పంద ఉద్యోగులు ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, వాళ్లు నిర్ధేశించిన విధులు చేయమని ఎదురు తిరగడం, రాజకీయ సిఫార్సుతో వచ్చామని తమ జోలికి రావద్దంటూ హెచ్చరించడం పట్ల ఉద్యోగ వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు