విలీన పాపం.. విద్యార్థులకు శాపం
పాఠశాలల్లో బడి మానేస్తున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. బడులు విలీన నేపథ్యంలో మరింత ఎక్కువ మంది బడులకు దూరంగానే ఉన్నారు.
పెరిగిన డ్రాపౌట్లు
విద్యాకానుకలు, హాజరుకు పొంతనే లేదు
జంతర్మంతర్గా పాఠశాల విద్య
గూడూరు, పుత్తూరు, న్యూస్టుడే: పాఠశాలల్లో బడి మానేస్తున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. బడులు విలీన నేపథ్యంలో మరింత ఎక్కువ మంది బడులకు దూరంగానే ఉన్నారు. గతేడాది నుంచి ఇదే తీరుగా బడులు మానేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో బడులు మూతేయగా బడి మానేసిన వారు వేల మందే కాగా వీటిని ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోకుండా మాయ చేస్తోంది. ప్రాథమిక స్థాయిలోని ఒకటో తరగతిలో ప్రవేశాలు పెద్దగా ఉండటం లేదు. గతంలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా అంగన్వాడీల నుంచి బడుల్లో చేర్పించే పరిస్థితుల వల్ల ప్రవేశాలు పెరిగేవి. బడుల్లో విద్యాకానుకలు ఎందుకు తగ్గించారన్న ప్రశ్న ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తోన్న మాట.
జనాభా.. విద్యార్థుల చేరికలో తేడా..
ఉమ్మడి జిల్లాలో 6-15 వయసు జనాభా 6,07,812 కాగా ఇందులో 1-10 తరగతుల్లో ప్రవేశాలు 5,77,299 మంది ఉన్నారు. సుమారుగా 30,513 మంది బడుల్లో లేనట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. వీరే కాకుండా ఇంత కంటే ఎక్కువ మందే బడి మానేస్తున్నా లెక్కల్లో చూపించడం లేదు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ వివరాలు తెలియజేయడం లేదు.
సీఆర్పీతో నడుస్తున్న యాలకారికండ్రిగ ప్రాథమిక పాఠశాల
నాయుడుపేట మండలం విన్నమాల ప్రాథమికోన్నత పాఠశాలలో 50 మంది నుంచి 25 మందికి చేరింది. ఇక్కడ విద్యార్థులు పుదూరుకి వెళ్లలేక బడి మానేశారు. కొందరు ప్రైవేటు బడుల్లో చేరడం గమనార్హం.
9, 10 నుంచే మానేస్తున్న వైనం..
ఉమ్మడి జిల్లాలో ఏటా 1.12 లక్షల మంది 9, 10 తరగతుల్లో ప్రవేశాలుంటే తదుపరి ఏడాది 10, 11 తరగతుల్లోకి 1.02 లక్షల మంది మాత్రమే చేరుతున్నారు. రెండు తరగతుల్లోనే ఏటా 9,879 మంది బడి మానేస్తున్నారు. ఎస్సీల్లో 9, 10 తరగతుల్లో ప్రవేశాలు 23,152 ఉంటే వీరిలో తదుపరి ఏడాది చేరింది 20,929 అంటే ఇక్కడ 2,223 మంది బడి మానేశారు. ఇదే తీరుగా ఎస్టీలు 4,898 మంది చదువుతుండగా ప్రమోట్ అయ్యింది 4,517 మంది కాగా 381 మంది బడి మానేశారు. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీలు బడికి దూరం అవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 4,864
చదువుతున్న విద్యార్థులు: 3.78 లక్షలు
విద్యాకానుక కిట్లు పొందుతున్నవారు: 3.33 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?