గంగమ్మ చెంతనేతల వేషాలు ముగిసినట్లేనా?
తిరుపతి తాతయ్యగుంట జాతర గురించి రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తిరుపతి (నగరపాలిక), న్యూస్టుడే: తిరుపతి తాతయ్యగుంట జాతర గురించి రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలకు తార్కాణంగా చెప్పుకొనే జాతరను అనాదిగా ఆలయ ఆచార వ్యవహారాల ప్రకారం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇటీవల రాజకీయ పెత్తనం పెరగడం తోడు అభివృద్ధి పేరుతో జాతరను సొంత ప్రచారాలకు వేదికగా చేసుకునే దుస్సంప్రదాయానికి తెరతీశారు. ఇన్నాళ్లూ గంగజాతర పేరుతో చేసిన హడావుడి తిరుపతివాసుల్లో అసహ్యం పెంచగా.. ఎన్నికల నియమావళి పుణ్యమాని ఈ ఏడాది సంప్రదాయబద్ధంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు నిర్వహించుకుంటున్నారు.
పునర్నిర్మాణంలోనూ..
ఆలయ పునర్నిర్మాణం కోసం తితిదే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.3.75 కోట్లు మంజూరు చేయగా తొలిదశలోనే రూ.8 కోట్లతో ఆలయ ప్రాంగణమంతా ఆధునికీకరించాలని నిర్ణయించారు. రాష్ట్ర దేవాదాయశాఖ, దాతలు, తితిదే సహకారంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. ఈక్రమంలో పనుల ప్రారంభోత్సవాలు, గర్భగుడి నిర్మాణం, కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠ పేరుతో నిత్యం వార్తాంశాల్ని సృష్టించుకునేవారు. చివరకు ఆలయ ఖాతాలోని ఫిక్స్డ్ డిపాజిట్ రూ.5 కోట్లు ఉపసంహరించుకున్నట్లు వార్తలు రాగా అధికారులుకానీ ప్రోత్సహించిన పెద్దలుకానీ దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఆలయ పునర్నిర్మాణం నేటికీ ముగించకపోగా పురావస్తు శాఖ పరిశీలన, ఆలయ చరిత్ర పేరుతో కొద్దిరోజులు ప్రచారం కొనసాగింది. తిరుపతి ఆవిర్భావం నుంచి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటన చేయడంతో చరిత్రకారుల్లో సైతం గందరగోళం కనిపించింది.
ఆచార వ్యవహారాలకు తిలోదకాలు
తిరుపతి కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి వస్తున్న ఏడురోజుల జాతరలో నూతనంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో అవి జాతర విశిష్ఠతను దెబ్బతిస్తాయనే ఆందోళన స్థానికులు, గంగమ్మ భక్తుల్లో కనిపించింది. చాటింపు నుంచి ఏడోరోజు ముగింపు సంబరంగా జరుపుకొనే చెంపనరికే కార్యక్రమం వరకు నిర్దేశిత సమయాలను అనుసరిస్తూ కైకాల కులస్తులు నిర్వహిస్తున్నారు. 2021 నుంచి ప్రముఖుల పేరుతో అచార వ్యవహారాల్ని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలున్నాయి. ప్రతి అంశంలోనూ తలదూర్చి సంప్రదాయాలను దెబ్బతీసిన వైనం ఈ ఏడాది జరుగుతున్న జాతరతో పోల్చితే కనిపిస్తుంది. సారెల పేరుతో గతంలో చేసిన హంగామా భక్తులపై పడింది.
సామాన్య భక్తులకు కష్టాలు..
జాతర ప్రచారం పిచ్చి గత రెండేళ్లు పరాకాష్ఠకు చేరింది. గతంలో దేవాదాయ శాఖ నిధులతో జరిగే జాతర కోసం తితిదే, తుడా, నగరపాలక సంస్థ, దాతల నుంచి విరాళాలు వసూలు చేయడం ప్రారంభించారు. తద్వారా జాతర వైభవాన్ని మరింత విస్తృతం చేస్తారని భావించినప్పటికీ వ్యక్తిగత ప్రచారం కోసం ఎక్కువగా వెచ్చిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్న ఆశలకు గండిపడగా జీవో జారీతో సరిపెట్టారు. ఊరంతా బ్యానర్లు, మైక్సెట్ల హోరు తోడు ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్ స్థాయి వరకు అందరూ సారె కోసం తండోపతండాలుగా వచ్చి తమ ప్రాబల్యం పెంచుకునే క్రమంలో సామాన్య భక్తులకు దర్శనం సంక్లిష్టం చేశారు.
గతంలో అన్నీ వివాదాలే..
ఆలయ ఆచారాల్ని పక్కనపెట్టి క్రతువులు జరిపించడం, ప్రజాప్రతినిధుల ఆర్భాటాలు, ఊరంతా మండపాలు, అమ్మవారి ప్రతిమల్ని ఏర్పాటుచేసి వాటిని సక్రమంగా పూజించలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖుల సందర్శనలపైనా వ్యక్తిగత ప్రచారం చేసుకున్న వైనం, ఆలయ అభివృద్ధి పేరుతో ఆలయ ఖాతాలోని నిధులను ఖాళీ చేయడం, ఆలయం ద్వారానికి పార్టీ రంగులతో పుష్పాలంకరణ చేయడం, వ్యక్తుల ఫొటోలతో ఊరంతా బ్యానర్లు, నిధుల వ్యయంపై అస్పష్టత వంటి అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం