వైకాపాకుకొమ్ము కాశారు..!
పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని.. వైకాపా నేతలకు కొమ్ము కాస్తున్న ఆరోపణలకు అధికారుల తీరు బలాన్ని చేకూర్చినట్లు ఉందని సిట్ అధికారులు రూపొందించిన నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.
సిట్ నివేదికతో సుస్పష్టం
కొత్త సెక్షన్లు చేర్చాల్సిందిగా ఐవోలకు సూచన
గన్మెన్ ధరణిపై సమ్మెటతో దాడిచేస్తున్న వైకాపా నేత భాను(పాతచిత్రం)
పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని.. వైకాపా నేతలకు కొమ్ము కాస్తున్న ఆరోపణలకు అధికారుల తీరు బలాన్ని చేకూర్చినట్లు ఉందని సిట్ అధికారులు రూపొందించిన నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. దాడుల సమయంలోనూ ఆ తర్వాత విచారణలోనూ అనేక తప్పిదాలు చేసినట్లు నిగ్గు తేల్చారు. కొన్ని కేసులకు సంబంధించి ప్రస్తుతం నమోదు చేసిన సెక్షన్లకు అదనంగా మరికొన్నింటిని జత చేసేందుకు సంబంధిత న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని స్పష్టం చేశారు. సిట్ నివేదికను పరిశీలిస్తే పోలీసులు ఏ మేరకు వైకాపాకు అడ్డగోలుగా సహకరిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది.
ఈనాడు-తిరుపతి: తిరుపతి, చంద్రగిరి పరిధిలో జరిగిన ఘర్షణలపై సిట్ అధికారులు ఆదివారం పరిశీలించిన విషయం తెలిసిందే. చంద్రగిరి, తిరుపతి పరిధిలో జరిగిన ఘటనలపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో 61 మంది నిందితులను గుర్తించగా 14 మందిని మాత్రమే అరెస్టు చేశారు. మరో 47 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. 13న పోలింగ్ ముగిసిన తర్వాత రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెలో జరిగిన ఘటనలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసి 37 మంది నిందితులను గుర్తించారు. ఒకరిని అరెస్టు చేశారు. 14న శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పులివర్తి నానిపై హత్యాయత్నంతోపాటు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మరో రెండు కేసులు నమోదు చేసి 24 మంది నిందితులను గుర్తించారు. ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. మొత్తంగా కొంతమందిపైనే కేసులు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకొన్నారన్నది స్పష్టమవుతోంది. ఘటన జరిగిన రోజున దానితో సంబంధం లేని వ్యక్తులపైనా కేసులు పెట్టి అరెస్టు చేశారన్న విమర్శలున్నాయి.
పోలీసుల వైఫల్యం..
ఎన్నికల రోజుతోపాటు ఆ తర్వాత జరిగిన ఘర్షణలను నివారించడంతోపాటు ఆ తర్వాత తీసుకున్న చర్యల్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని సిట్ అధికారులు తేల్చారు. ఈ ఘర్షణల్లో అనేకమంది దుర్మార్గులు పాల్గొన్నారని, దీనివల్ల పలువురికి తీవ్ర గాయాలు కావడంతోపాటు ప్రాణనష్టం కూడా జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఘటనల తర్వాత కూడా పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదని సిట్ అధికారులు తమ నివేదికలో పొందుపర్చారు. సిట్ అధికారుల నివేదిక పూర్తిస్థాయిలో బహిర్గతమైతే ఎవరెవరి తప్పిదాలున్నాయో బయటపడే ఆస్కారం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం