బిల్లులు ఇచ్చాం.. నిధులు ఇవ్వండి
అడ్డగోలుగా తాము చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులను తుడా నుంచి విడుదల చేయించుకునే పనిలో పడ్డారు చంద్రగిరి నేతలు.
తుడాపై ఒత్తిడి తెచ్చిన చంద్రగిరి అధికారులు
రెండు రోజుల్లో రూ.6 కోట్ల విడుదలకు సన్నద్ధం
మరోసారి తుడా నిధులు అప్పనంగా కాజేసే యత్నం
తిరుపతి (నగరపాలిక), న్యూస్టుడే: అడ్డగోలుగా తాము చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులను తుడా నుంచి విడుదల చేయించుకునే పనిలో పడ్డారు చంద్రగిరి నేతలు. అందుకు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. ఈమేరకు గ్రాంట్ల రూపంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన జాబితాలను ఆయాశాఖల అధికారులు తుడాకు సమర్పించి రూ.6 కోట్లు విడుదల చేయాలని ఒత్తిడి చేయగా అధికారులు సైతం ఒప్పుకొన్నట్లు తెలిసింది.
దోచిపెట్టే పన్నాగం.. చంద్రగిరి నేతలే తుడా పాలకులుగా ఉండటంతో.. నిబంధనలు పక్కన పెట్టి.. చంద్రగిరికి రూ. వందల కోట్లు కేటాయించి పనులు చేయించుకున్నారు. అవన్నీ గ్రాంట్ల (తిరిగి చెల్లించని) రూపంలోనే మంజూరు చేశారు. ఈ పరంపర ఎన్నికల వరకు కొనసాగింది. పనులు సైతం మండల పరిషత్తులు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యంలో జరిగాయి. నిధుల విడుదలపై వైకాపా నాయకులు హామీలు ఇవ్వడంతో వారంతా ఎగబడి పనులు చేశారు. ఎన్నికల నియామవళి అమల్లోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్ల నిధులను తుడా అధికారులు ఎంపీడీవోల ఖాతాలకు జమచేశారు. అవన్నీ వారు పనులు చేపట్టిన గుత్తేదారులైన అధికార పార్టీ నాయకులకు చెల్లించారు. దీన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురాగా.. అప్పటి కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఎంపీడీవోలు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగా ఇంకా చర్యలు తీసుకోలేదు.
మరోసారి ఉల్లంఘనలకు సిద్ధం.. పోలింగ్ పూర్తయిన తర్వాత మరోసారి విడుదల చేయించి నాయకులకు మేలుచేసేలా అధికారులు పావులు కదిపారు. చంద్రగిరి నియోజకవర్గ ఎంపీడీవోలంతా బుధవారం తుడా కార్యాలయానికి చేరుకుని అభివృద్ధి పనుల జాబితా, నిధుల వివరాలు సమర్పించినట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి ఉన్నా గురు, శుక్రవారాల్లో నిధులు విడుదల చేస్తామని తుడా అధికారులు వారికి సమాధానం ఇచ్చారు. రెండు రోజుల్లోనే బిల్లులు చెల్లిస్తామని అధికారులు గుత్తేదారులకు సమాచారం ఇచ్చేశారు.
ఈసీకి ఫిర్యాదు.. ఈ విషయమై చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని, తిరుపతి కూటమి అభ్యర్థి అరణి శ్రీనివాసులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గ్రాంటు రూపంలో ఇచ్చే నిధులకు సంబంధించి నిబంధనలు పాటించాలని, ఎన్నికల నియమావళి ముగిసేంత వరకు నిధులు మంజూరు చేయడంపై స్పష్టత ఇవ్వాలని, సంబంధిత అధికారుల్ని ఆదేశించి ఎన్నికల నియమావళిని పాటించేలా చూడాలని రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్