శివా.. కేశవా.. కానరావా..!
ఎండ తీవ్రత.. ఉక్కపోత దృష్ట్యా శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
తిరుమల ఆళ్వారు ట్యాంకు వద్ద క్యూలైన్
శ్రీకాళహస్తి, న్యూస్టుడే: ఎండ తీవ్రత.. ఉక్కపోత దృష్ట్యా శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శనివారం మహాశివరాత్రిని తలపించేలా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు 30 వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. 4927 రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు జరిగాయి.
రాహు, కేతు సర్పదోష నివారణ పూజలకు క్యూలైన్లలో నిరీక్షిస్తున్న భక్తులు
తీవ్ర స్థాయిలో తోపులాటలు: వీలైనంత వరకు దర్శనార్థం వచ్చే భక్తులకు మహద్వారం వెలుపల ఉంచేలా గతంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితికి మంగళం పలకడంతో అవస్థలు తప్పడం లేదు. ఆలయంలో సర్వదర్శనం, ప్రత్యేక శీఘ్రదర్శనం పేరుతో క్యూలైన్లు ఉన్నాయి. సర్వదర్శనం, రూ.50 ప్రత్యేక దర్శనం భక్తులందరూ మహద్వారం వద్ద కలుస్తుంటారు. అయితే అలంకార మండపం, స్వామి వారి ఆలయ ముఖ మండపం వద్ద మళ్లీ క్యూలైన్లు ఏర్పాటు చేసి దర్శనాలకు అనుమతిస్తున్నారు. రాజకీయ సిఫార్సులు, దళారులు తీసుకొచ్చే భక్త బృందాలను ధ్వజస్తంభం వెనుక వైపు నుంచి క్యూలైన్లలో వదలిపెడుతున్నారు. దీంతో ముఖమండపం వద్ద క్యూలైన్లలో తోపులాటలు జరుగుతున్నాయి. సిఫార్సు దర్శనాలు ఎక్కువ కావడం, వచ్చిన భక్తులు ఉద్యోగులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది, వివిధ శాఖల సిఫార్సులతో తీసుకురావడంతో సామాన్య భక్తులకు అవస్థలు తప్పడం లేదు.
ఆలయం ఎదుట భక్తుల రద్దీ
తిరుమల, న్యూస్టుడే: వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుండగా తితిదే ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆక్టోపస్ భవనం నుంచి కృష్ణతేజ కూడలి వరకు 27 తాగునీటి సరఫరా కేంద్రాలు, నాలుగు అన్న ప్రసాద వితరణ కేంద్రాలు, 25 మంది తితిదే విజిలెన్స్ సిబ్బందితోపాటు ప్రతి పాయింట్లో ముగ్గురు శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసినట్లు తితిదే వెల్లడించింది. పదిరోజుల్లో అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గంలో 2.60 లక్షల మంది భక్తులు కాలినడకన తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొంది. భక్తుల కోసం ప్రత్యేకంగా అక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ధర్మరథం బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం ఐదుగంటలకు 46,486 మంది సర్వదర్శనం భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, నిరంతరంగా భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నామని తితిదే పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్